Tirumala: తిరుమల మొదటి ఘాట్‌రోడ్‌లో ప్రమాదం.. మహిళ మృతి

తిరుమల మొదటి ఘాట్‌రోడ్‌లో జరిగిన ప్రమాదంలో ఓ మహిళా భక్తురాలు మృతి చెందారు.

Published : 14 May 2023 17:56 IST

తిరుమల: తిరుమల మొదటి ఘాట్‌రోడ్‌లో జరిగిన ప్రమాదంలో ఓ మహిళా భక్తురాలు మృతి చెందారు. తిరుమల నుంచి తిరుపతికి వస్తుండగా భక్తులు ప్రయాణిస్తున్న జీపు మొదటి ఘాట్‌రోడ్డులోని 24వ మలుపు వద్ద అదుపు తప్పి రక్షణ గోడను ఢీకొంది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న మహిళా భక్తురాలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 10మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తిరుమల ట్రాఫిక్‌ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు