న్యాయవాదుల హత్య: కస్టడీకి నిందితులు

పెద్దపల్లి జిల్లాలో జరిగిన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు (49), నాగమణి (45) హత్యకేసులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో నిందితులుగా

Updated : 25 Feb 2021 12:52 IST

మంథని: పెద్దపల్లి జిల్లాలో జరిగిన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు (49), నాగమణి (45) హత్యకేసులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న కుంట శ్రీనుతో పాటు మరో ఇద్దరిని కస్టడీకి కోరుతూ డీసీపీ రవీందర్‌ మంథని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన మంథని న్యాయస్థానం.. నిందితులు కుంట శ్రీను, చిరంజీవి, కుమార్‌లను వారం రోజులపాటు కస్టడీకి తీసుకునేందుకు పోలీసులకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం నిందితులు వరంగల్‌ కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్నారు. కోర్టు అనుమతి మేరకు నిందితులను అదుపులోకి తీసుకుని లోతుగా విచారిస్తే కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద గట్టు వామన్‌రావు, నాగమణి దంపతులు దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. కారులో హైదరాబాద్‌ వస్తుండగా మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారిపై పట్టపగలే నరికి చంపేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని