ఉద్యమకారిణిపై అత్యాచారం, కొవిడ్తో మృతి!
దేశ రాజధానిలో రైతులు చేస్తోన్న ఆందోళనలకు మద్దతు తెలిపేందుకు వచ్చిన ఓ మహిళా ఉద్యమకారిణి(25)పై గ్యాంగ్రేప్ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
టిక్రీ సరిహద్దులో ఘటన
దిల్లీ: దేశ రాజధానిలో రైతులు చేస్తోన్న ఆందోళనలకు మద్దతు తెలిపేందుకు వచ్చిన ఓ సామాజిక ఉద్యమకారిణి(25)పై గ్యాంగ్రేప్ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతనెలలో ఈ ఘటన జరిగిన అనంతరం.. తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరింది. అదే సమయంలో కొవిడ్ నిర్ధారణ కావడంతో పరిస్థితి విషమించి ఏప్రిల్ 30న ప్రాణాలు కోల్పోయింది. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, ప్రత్యేక బృందాలతో దర్యాప్తునకు ఆదేశించారు. రైతు ఉద్యమంలో పాల్గొనేందుకు వచ్చిన యువతిపై అత్యాచరం జరిగినట్లు వస్తోన్న వార్తలపై స్పందించిన సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం), మహిళలపై ఇలాంటి ఘటనలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని ప్రకటించింది.
ఎస్కేఎం ప్రకటన ప్రకారం, పశ్చిమబెంగాల్కు చెందిన ఓ యువ ఉద్యమకారిణి(25), ‘కిసాన్ సోషల్ ఆర్మీ’కి చెందిన నలుగురు వ్యక్తులతో కలిసి రైతుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు హరియాణాలోని టిక్రీ సరిహద్దుకి బయలుదేరారు. ఏప్రిల్ 11న అక్కడి రైతుల నిరసనల్లో పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి దిల్లీకి వెళ్లే మార్గంలో ఆ నలుగురు వ్యక్తులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో తీవ్ర జ్వరంతో పాటు అస్వస్థతకు గురైన బాధిత మహిళ, దిల్లీలోని జగ్గార్ ఆసుపత్రిలో చేరారు. అదే క్రమంలో పరీక్షల్లో ఆమెకు కొవిడ్ నిర్ధారణ అయ్యింది. నాలుగు రోజుల అనంతరం పరిస్థితి విషమించడంతో ఏప్రిల్ 30న ఆసుపత్రిలో కన్నుమూసినట్లు సమాచారం. అయితే, యువతి చనిపోయే ముందు తనపై జరిగిన అఘాయిత్యం గురించి ఆమె తండ్రికి ఫోన్లో తెలియజేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హరియాణా పోలీసులు తెలిపారు. మూడు ప్రత్యేక బృందాల ద్వారా కేసు దర్యాప్తు ప్రారంభించినట్లు స్థానిక పోలీస్ అధికారి విజయ్ కుమార్ వెల్లడించారు.
ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే కిసాన్ సోషల్ ఆర్మీపై చర్యలు తీసుకున్నామని టీక్రీలోని రైతు సంఘం వేదిక సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. టిక్రీ సరిహద్దులో కిసాన్ సోషల్ ఆర్మీకి చెందిన టెంట్లు తొలగించడంతో పాటు ఆ బృందానికి చెందిన వారిని ఉద్యమంలో పాల్గొనకుండా నిషేధం విధించినట్లు వెల్లడించింది. ప్రాణాలు కోల్పోయిన తమ సహఉద్యమకారిణి పక్షాన న్యాయం కోసం పోరాడుతామని సంయుక్త కిసాన్ మోర్చా స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం