Mumbai: క్యాబ్ డ్రైవర్ తప్పుగా ప్రవర్తించాడు.. చాలా భయం వేసింది..: నటి పోస్ట్
ఓ క్యాబ్ డ్రైవర్ నుంచి తనకు ఎదురైన భయానక అనుభవాన్ని మరాఠా నటి, దర్శకురాలు మానవ నాయక్(Manava Naik) వెల్లడించారు.
ముంబయి: ఓ క్యాబ్ డ్రైవర్ నుంచి తనకు ఎదురైన భయానక అనుభవాన్ని మరాఠా నటి, దర్శకురాలు మానవ నాయక్(Manava Naik) వెల్లడించారు. శనివారం రాత్రి బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) నుంచి తన ఇంటికి వెళ్లేందుకు ఉబర్ క్యాబ్ బుక్ చేసుకోగా ఆ డ్రైవర్ తనతో తప్పుగా ప్రవర్తించాడని.. భయభ్రాంతులకు గురిచేశాడని ఆమె ఆరోపించారు. ఈ మేరకు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఫేస్బుక్లో షేర్ చేసుకోగా.. దీనిపై ముంబయి సంయుక్త పోలీస్ కమిషనర్ (శాంతిభద్రతలు) విశ్వాస్ నాగ్రే పాటిల్ స్పందించారు. ఈ ఘటనను పోలీసులు సీరియస్గా తీసుకొని దర్యాప్తు చేస్తున్నారని.. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. మానవ నాయక్ పలు మరాఠి చిత్రాలతో పాటు అనేక హిందీ టీవీ షోలలో నటించారు.
నటి ఫేస్బుక్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ‘‘శనివారం రాత్రి 8.15 గంటల సమయంలో బీకేసీ నుంచి ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకున్నా. లోపలికి ఎక్కి కూర్చున్న తరువాత ట్యాక్సీ డ్రైవర్ ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని అభ్యంతరం చెబుతున్నా వినడంలేదు. బీకేసీ వద్ద సిగ్నల్ జంప్ చేసి ట్రాఫిక్ రూల్స్ని ఉల్లంఘించాడు. పోలీసులు క్యాబ్ని ఆపి ఫొటో తీసుకున్నారు. ఆ సమయంలో ట్రాఫిక్ సిబ్బందితోనూ వాగ్వాదానికి దిగాడు. దీంతో నేను జోక్యం చేసుకొని.. ఫొటో తీశారు గనక వదిలేయాలని కోరడంతో పోలీసులు ఆ వాహనాన్ని వదిలిపెట్టారు.
అయితే, పోలీసులు విధించిన ఫైన్ రూ.500 మీరు చెల్లిస్తారా? అంటూ ఆ డ్రైవర్ నాపై కోపంగా అరిచాడు. చెల్లించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరించాడు. దీంతో క్యాబ్ని పోలీస్ స్టేషన్కు పోనివ్వవాలని అడగడంతో అతడు వాహనాన్ని బీకేసీ వద్ద ఓ చీకటి ప్రదేశంలో నిలిపాడు. ఆ తర్వాత డ్రైవర్ వాహనాన్ని చునాభట్టి రోడ్, ప్రియదర్శిని పార్క్ మార్గంలో వేగంగా తీసుకెళ్లాడు. దీంతో ఫిర్యాదు చేసేందుకు ఉబర్ సేఫ్టీ హెల్ప్లైన్కు ఫోన్ చేశా. హెల్ప్లైన్ ఎగ్జిక్యూటివ్ కాల్లో ఉండగానే ఆ డ్రైవర్ మరోసారి క్యాబ్ స్పీడ్ని పెంచాడు. కారు ఆపాలని అడిగినా.. ఆపకుండా ఎవరికో కాల్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో చాలా భయం వేసి సాయం కోసం కేకలు వేయడం మొదలుపెట్టా. రెండు మోటార్ బైక్లు, ఒక ఆటో రిక్షా క్యాబ్ని కార్నర్ చేసి ఆపి నన్ను కాపాడారు. నేను సురక్షితంగానే ఉన్నా.. కానీ భయపడ్డా’’ అని నటి తన ఫేస్బుక్ ఖాతాలో రాసుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.