Jacqueline Fernandez: నాలుగోసారి విచారణకు హాజరుకాని జాక్వెలిన్‌

మనీ లాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణకు జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ హాజరు కాలేదు. ఆమె విచారణకు హాజరుకాకుండా తప్పించుకోవడం ఇది నాలుగోసారి. సుఖేష్‌ చంద్రశేఖర్‌, ఆయన భార్య లీనా పౌల్‌పై నమోదైన

Published : 18 Oct 2021 16:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మనీ లాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణకు జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ హాజరు కాలేదు. ఆమె విచారణకు  గైర్హాజరు కావడం ఇది నాలుగోసారి. సుఖేష్‌ చంద్రశేఖర్‌, ఆయన భార్య లీనా పౌల్‌పై నమోదైన కేసుకు సంబంధించి విచారణకు జాక్వెలిన్‌ను అధికారులు పిలిచారు. 

ఇప్పటికే ఈడీ సాక్షిగా ఆమె వాంగ్మూలాన్ని ఆగస్టు 30వ తేదీన నమోదు చేసుకొన్నారు. నాటి నుంచి ఈ నటి విచారణకు హాజరుకావడంలేదు. సెప్టెంబర్‌ 25, అక్టోబర్‌ 15,16 తేదీల్లో విచారణకు హాజరుకావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. కానీ, ఈ నటి మాత్రం విచారణకు వెళ్లలేదు. వృత్తిపరంగా ఆమె బిజీగా ఉండటంతో విచారణకు హాజరుకావడం సాధ్యం కావడంలేదని సమాచారం. 

ఈ కేసులో ఇప్పటికే సుఖేష్‌ చంద్రశేఖర్‌, లీనా పౌలను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రముఖ వ్యాపార వేత్త శివేందర్‌ సింగ్‌ భార్య అథితి సింగ్‌ ఫిర్యాదు మేరకు వీరిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే నోరా ఫాతెను కూడా అధికారులు ప్రశ్నించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని