Adibatla kidnap case: యువతి కిడ్నాప్ కేసు.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
మన్నెగూడలో యువతి కిడ్నాప్ కేసుకు సంబంధించి తాజాగా పోలీసులు రిమాండ్ రిపోర్టును విడుదల చేశారు. ఈ రిపోర్టులో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
హైదరాబాద్: ప్రేమించిన అమ్మాయి మరొకరితో పెళ్లికి సిద్ధపడిందని ఆ యువతిని ప్రియుడు అపహరించుకుపోయిన సంఘటన రాష్ట్ర రాజధాని శివారు మన్నెగూడలో ఈ నెల 9వ తేదీన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి పోలీసులు విడుదల చేసిన రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
‘‘గతేడాది బొంగులూరులోని స్పోర్ట్స్ అకాడమీలో వైశాలికి నవీన్తో పరిచయం ఏర్పడింది. నవీన్.. వైశాలి ఫోన్ నంబర్ తీసుకొని తరచూ కాల్స్, మెసేజ్లు చేసేవాడు. ఆమెతో కలిసి ఫొటోలు తీసుకొని పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. తల్లిదండ్రులు అంగీకరిస్తే పెళ్లి చేసుకుంటానని ఆమె చెప్పింది. వైశాలి తల్లిదండ్రులను ఒప్పించేందుకు నవీన్ ప్రయత్నించాడు. వారు పెళ్లికి అంగీకరించకపోవడంతో నవీన్రెడ్డి కక్ష పెంచుకున్నాడు. వైశాలి పేరుతో నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతా తెరిచాడు. ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలను వైరల్ చేశాడు. 6 నెలల క్రితం యువతి ఇంటి ముందు స్థలాన్ని నవీన్ లీజుకు తీసుకున్నాడు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా నవీన్, అతని స్నేహితులు యువతి ఇంటి ముందు అలజడి సృష్టించారు. దీంతో యువతి ఫిర్యాదు మేరకు నవీన్పై పలు సెక్షన్ల కింద ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ నెల 9న వైశాలికి జరిగిన నిశ్చితార్థం గురించి నవీన్ తెలుసుకున్నాడు. యువతిని అపహరించి పెళ్లి చేసుకోవాలని కుట్ర పన్నాడు. అనుచరులు, టీ స్టాళ్లలో పనిచేసే సిబ్బందిని ఇందుకోసం ఉపయోగించుకున్నాడు. ఇంటి ముందు నిలిపిన 5 కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. యువతి ఇంట్లో సామగ్రి ధ్వంసం చేసి సీసీ కెమెరాలు, డీవీఆర్లు ఎత్తుకెళ్లారు. వైశాలిని అపహరించి కారులో నల్గొండవైపు తీసుకెళ్లారు. తన కోసం పోలీసులు వెతుకుతున్నారనే విషయాన్ని నవీన్ సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్నాడు. నల్గొండ వద్ద నవీన్రెడ్డి, అతడి స్నేహితులు కారు నుంచి దిగిపోయారు. నవీన్ మరో స్నేహితుడు రుమాన్.. వోల్వో కారులో వైశాలిని హైదరాబాద్ తీసుకొచ్చాడు. ఈ నెల 9న సాయంత్రం క్షేమంగా ఉన్నట్లు వైశాలి.. తన తండ్రికి ఫోన్ చేసి చెప్పింది. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. అపహరణ కేసులో ఇప్పటివరకు 32 మందిని అరెస్టు చేశాం. ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీన్రెడ్డి, మరో ముగ్గురి కోసం గాలిస్తున్నాం’’ అని రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావు సహా ఐదుగురిపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. -
గంజాయి మిల్క్షేక్!.. మత్తు ముఠాల నయా దందా
గంజాయి విక్రేతలు కొత్త పంథా అనుసరిస్తున్నారు. హ్యాష్ ఆయిల్.. చాక్లెట్లుగా మార్చి విక్రయించడం పాత ట్రెండు.. ఇప్పుడు గంజాయిని పొడిగా చేసి విక్రయిస్తున్నారు. -
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని నార్కట్పల్లి-అద్దంకి రహదారి నల్గొండ జిల్లా కేంద్రంలో భారాస నాయకుడు మృతిచెందారు. -
ప్రకాశం జిల్లాలో మద్యం డంప్ స్వాధీనం
ప్రకాశం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్శి సెబ్ కార్యాలయంలో ఎస్పీ గరుడ్ సుమిత్సునీల్ బుధవారం వివరాలను వెల్లడించారు. -
మావోయిస్టులకు శరాఘాతం!
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఉత్తర బస్తర్ డివిజన్ కమిటీ భారీ మూల్యం చెల్లించుకుంది. -
జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది పరారీ
కిటికీ గ్రిల్స్ తొలగించి జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది బాలురు పరారైన ఘటన మేడ్చల్ జిల్లా గాజులరామారంలో సంచలనం సృష్టించింది. -
తప్పుడు ప్రకటనలతో మందుల విక్రయం
జ్వరాన్ని నయం చేస్తుందని తప్పుడు ప్రకటనలతో విక్రయిస్తున్న మందులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
గుజరాత్లో రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం
గుజరాత్లో ఆగివున్న చమురు ట్యాంకర్ను వేగంగా వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా 10 మంది దుర్మరణం చెందినట్లు పోలీసులు తెలిపారు. -
అనంత్నాగ్లో బిహార్ కూలీని కాల్చిచంపిన ఉగ్రవాదులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రవాదులు మరోమారు పేట్రేగిపోయారు. బుధవారం అనంత్నాగ్ జిల్లాలో బిహార్కు చెందిన కూలీని కాల్చి చంపారు.
తాజా వార్తలు (Latest News)
-
జాబిల్లిపై చైనా ముందే కాలుమోపితే.. అక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు
-
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?