లాయర్‌ దంపతుల హత్య: దర్యాప్తు ముమ్మరం

న్యాయవాద దంపతులు వామన్‌రావు, నాగమణి హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. కుంట శ్రీనుతో పాటు మరో ఇద్దరిని కస్టడీకి అప్పగించాలని కోరుతూ మంథని కోర్టులో రామగిరి పోలీసులు ..

Updated : 22 Feb 2021 15:04 IST

పెద్దపల్లి: తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు వామన్‌రావు, నాగమణి హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. కుంట శ్రీనుతో పాటు మరో ఇద్దరిని కస్టడీకి అప్పగించాలని కోరుతూ మంథని కోర్టులో రామగిరి పోలీసులు కస్టడీ పిటిషన్‌ వేశారు. ప్రస్తుతం రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న నిందితుడు బిట్టు శ్రీనును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితులకు వాహనం, ఆయుధాలు సమకూర్చడంపై బిట్టు శ్రీనుపై అభియోగాలు ఉన్నాయి. ఈ నెల 19న ముగ్గురు నిందితులను ఘటనా స్థలం వద్దకు తీసుకెళ్లిన పోలీసులు.. హత్య సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు. అనంతరం దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని