shraddha walker murder case: శ్రద్ధా వాకర్ ఉంగరాన్ని కొత్త గర్ల్ఫ్రెండ్కు గిఫ్ట్గా ఇచ్చిన ఆఫ్తాబ్..!
శ్రద్ధాను హత్య చేసిన తర్వాత ఆమె ఉంగరాన్ని ఆఫ్తాబ్ మరో యువతికి గిఫ్ట్గా ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. సదరు యువతిని విచారించగా అది నిజమే అని తేలింది.
ఇంటర్నెట్డెస్క్: శ్రద్ధా వాకర్ హత్య కేసులో ఆఫ్తాబ్ కప్పిపెట్టిన వాస్తవాలను పోలీసులు తవ్వి తీస్తున్నారు. హత్య చేసిన అనంతరం ఆఫ్తాబ్ ఆమె బంగారపు ఉంగరాన్ని తన వద్దే ఉంచుకొన్నాడు. ఆ తర్వాత మరో యువతికి వలవేసి ఇంటికి పిలిపించుకొన్నాడు. ఆ సమయంలో ఆమెకు శ్రద్ధా బంగారపు ఉంగరాన్ని గిఫ్ట్గా ఇచ్చాడు. ఇటీవల ఆమెను పోలీసులు విచారణకు పిలిపించి పలు ప్రశ్నలు అడిగారు. ఆఫ్తాబ్ ఇంటికి వెళ్లిన సమయంలో అతడో బంగారపు ఉంగరం బహుమతిగా ఇచ్చినట్లు సదరు యువతి పోలీసులకు వెల్లడించింది. పోలీసులు ఆ ఉంగరాన్ని స్వాధీనం చేసుకొని శ్రద్ధా త్రండికి చూపించారు. ఆయన దానిని తన కుమార్తె ఉంగరంగా గుర్తించారు.
శ్రద్ధాను హత్య చేసిన తర్వాత ఆమె తలను శరీరం నుంచి వేరుచేశాడు. అనంతరం ఆమె తలపై జుట్టును తొలగించి ఓ ప్యాకెట్లో ఉంచి ఛత్రపూర్ అడవుల్లో పారేశాడు. పోలీసులు ఆ ప్యాకెట్ను స్వాధీనం చేసుకొన్నట్లు సమాచారం.
కట్టుకథలతో ముంబయికి..
శ్రద్ధా హత్య అనంతరం ఆఫ్తాబ్ ముంబయి వెళ్లాడు. అక్కడ కొందరు శ్రద్ధా మిత్రులను కూడా కలిశాడు. తనకు ఆమెతో బ్రేకప్ అయిందటూ వారికి కట్టుకథలు చెప్పాడు. వారు కూడా ఆఫ్తాబ్ను అనుమానించలేదు. మహారాష్ట్రలోని వాసైలో అతడు శ్రద్ధా ఫోన్ను వైఫైకు కనెక్ట్ చేసి ఆమె మిత్రులతో ఛాటింగ్ చేసినట్లు దిల్లీ పోలీసులు గుర్తించారు.
గుజరాత్లో మాదకద్రవ్యాల సరఫరాదారు అరెస్టు..
గుజరాత్లోని సూరత్లో మాదకద్రవ్యాల సరఫరా చేస్తున్నాడనే అనుమానంతో ఫైసల్ మొమిన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతడికి ఆఫ్తాబ్ పూనావాలతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్నారు. మహారాష్ట్రలోని వాసైలో ఫైసల్ ఉండే ప్రదేశంలోనే అఫ్తాబ్ కూడా ఉండేవాడు. గుజరాత్ పోలీసులు సాధారణ తనిఖీల సమయంలో ఇతడు దొరికాడు. ఇతడితోపాటు ముంబయికి చెందిన అంకిత్ షిండే అనే మరో వ్యక్తిని అరెస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!