shraddha walker murder case: శ్రద్ధా వాకర్ ఉంగరాన్ని కొత్త గర్ల్ఫ్రెండ్కు గిఫ్ట్గా ఇచ్చిన ఆఫ్తాబ్..!
శ్రద్ధాను హత్య చేసిన తర్వాత ఆమె ఉంగరాన్ని ఆఫ్తాబ్ మరో యువతికి గిఫ్ట్గా ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. సదరు యువతిని విచారించగా అది నిజమే అని తేలింది.
ఇంటర్నెట్డెస్క్: శ్రద్ధా వాకర్ హత్య కేసులో ఆఫ్తాబ్ కప్పిపెట్టిన వాస్తవాలను పోలీసులు తవ్వి తీస్తున్నారు. హత్య చేసిన అనంతరం ఆఫ్తాబ్ ఆమె బంగారపు ఉంగరాన్ని తన వద్దే ఉంచుకొన్నాడు. ఆ తర్వాత మరో యువతికి వలవేసి ఇంటికి పిలిపించుకొన్నాడు. ఆ సమయంలో ఆమెకు శ్రద్ధా బంగారపు ఉంగరాన్ని గిఫ్ట్గా ఇచ్చాడు. ఇటీవల ఆమెను పోలీసులు విచారణకు పిలిపించి పలు ప్రశ్నలు అడిగారు. ఆఫ్తాబ్ ఇంటికి వెళ్లిన సమయంలో అతడో బంగారపు ఉంగరం బహుమతిగా ఇచ్చినట్లు సదరు యువతి పోలీసులకు వెల్లడించింది. పోలీసులు ఆ ఉంగరాన్ని స్వాధీనం చేసుకొని శ్రద్ధా త్రండికి చూపించారు. ఆయన దానిని తన కుమార్తె ఉంగరంగా గుర్తించారు.
శ్రద్ధాను హత్య చేసిన తర్వాత ఆమె తలను శరీరం నుంచి వేరుచేశాడు. అనంతరం ఆమె తలపై జుట్టును తొలగించి ఓ ప్యాకెట్లో ఉంచి ఛత్రపూర్ అడవుల్లో పారేశాడు. పోలీసులు ఆ ప్యాకెట్ను స్వాధీనం చేసుకొన్నట్లు సమాచారం.
కట్టుకథలతో ముంబయికి..
శ్రద్ధా హత్య అనంతరం ఆఫ్తాబ్ ముంబయి వెళ్లాడు. అక్కడ కొందరు శ్రద్ధా మిత్రులను కూడా కలిశాడు. తనకు ఆమెతో బ్రేకప్ అయిందటూ వారికి కట్టుకథలు చెప్పాడు. వారు కూడా ఆఫ్తాబ్ను అనుమానించలేదు. మహారాష్ట్రలోని వాసైలో అతడు శ్రద్ధా ఫోన్ను వైఫైకు కనెక్ట్ చేసి ఆమె మిత్రులతో ఛాటింగ్ చేసినట్లు దిల్లీ పోలీసులు గుర్తించారు.
గుజరాత్లో మాదకద్రవ్యాల సరఫరాదారు అరెస్టు..
గుజరాత్లోని సూరత్లో మాదకద్రవ్యాల సరఫరా చేస్తున్నాడనే అనుమానంతో ఫైసల్ మొమిన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతడికి ఆఫ్తాబ్ పూనావాలతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్నారు. మహారాష్ట్రలోని వాసైలో ఫైసల్ ఉండే ప్రదేశంలోనే అఫ్తాబ్ కూడా ఉండేవాడు. గుజరాత్ పోలీసులు సాధారణ తనిఖీల సమయంలో ఇతడు దొరికాడు. ఇతడితోపాటు ముంబయికి చెందిన అంకిత్ షిండే అనే మరో వ్యక్తిని అరెస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం