Aaftab: శ్రద్ధాను కిరాతకంగా చంపి.. ఇతర అమ్మాయిలతో డేటింగ్ చేసి..!
శ్రద్ధా వాకర్ (Shraddha Walkar) హత్య కేసుకు సంబంధించి పోలీసులు దాఖలు చేసిన 6వేల పేజీల ఛార్జిషీట్లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
దిల్లీ: శ్రద్ధావాకర్ (Shraddha Walkar) హత్యకేసు దర్యాప్తులో ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. శ్రద్ధాను చంపిన తర్వాత ఆమె శరీర భాగాలను ముక్కులుగా కోసిన ఆఫ్తాబ్ పూనావాలా (Aaftab Poonawala).. వాటిని పలు ప్రదేశాల్లో విసిరేసినట్లు ఇప్పటికే తేలింది. అయితే, వాటిలో కొన్నింటి ఎముకలను నేరుగా కాకుండా రోలుతో పొడిగా చేసి పడేసినట్లు మొదట చెప్పినప్పటికీ.. అవన్నీ పోలీసులను తప్పుదోవ పట్టించేందుకేనని వెల్లడైంది. అయితే, చిట్ట చివరగా ఆమె తలను మాత్రం మూడు నెలల తర్వాత బయట పడేసినట్లు దిల్లీ పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా శ్రద్ధాను చంపిన అనంతరం మే 18న ఆన్లైన్లో చికెన్ రోల్ను ఆర్డర్ చేసుకొని తిన్నట్లు ఇటీవల దాఖలు చేసిన ఛార్జిషీట్లో పోలీసులు పేర్కొన్నారు.
చాలామంది గర్ల్ఫ్రెండ్స్..
ఆఫ్తాబ్ పూనావాలా, శ్రద్ధా వాకర్లు దిల్లీలో మకాం పెట్టిన తర్వాత వారిద్దరి మధ్య పలు విషయాల్లో తగాదాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఖర్చులు, ఇతర మహిళలతో ఆఫ్తాబ్కు పరిచయం వంటి విషయాల్లో వీరిద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఆఫ్తాబ్కు దిల్లీ నుంచి దుబాయ్ వరకు ఎంతో మంది గర్ల్ఫ్రెండ్స్ ఉన్నారు. మే 18న ఇద్దరు కలిసి ముంబయికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే, చివరి నిమిషంలో ఆఫ్తాబ్ టికెట్ రద్దయ్యింది. వారిద్దరి మధ్య మరోసారి తగాదాకు ఇది కూడా కారణమయ్యింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడం.. ఆ సమయంలో శ్రద్ధాను ఆఫ్తాబ్ గొంతుకోసి చంపేశాడు’ అని దిల్లీ పోలీసులు తమ ఛార్జిషీట్లో పేర్కొన్నారు.
ప్లాస్టిక్ బ్యాగును కొని..
తొలుత శ్రద్ధా శరీరాన్ని ప్లాస్టిక్ బ్యాగులో వేసుకొని బయటపడేయాలని అనుకున్నాడు. ఇందుకోసం బ్యాగును కూడా తీసుకువచ్చాడు. అలా చేస్తే వెంటనే దొరికిపోతానని భావించిన ఆఫ్తాబ్.. మృతదేహాన్ని ముక్కలుగా కోసి పడేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం రంపం, సుత్తె, మూడు కత్తులు కొనుగోలు చేశాడు. వేళ్లను వేరు చేసేందుకు ప్రత్యేకంగా వేడి యంత్రాన్ని (Blow Torch) కూడా కొన్నాడు. మరుసటి రోజు కొత్త ఫ్రిజ్ ఖరీదు చేశాడు. అనంతరం నాలుగు రోజుల్లో మృతదేహాన్ని 17 భాగాలు చేసి చేసి ఫ్రిజ్లో పెట్టాడు. అయితే, తర్వాత అతడు వేరే అమ్మాయిలో డేటింగ్ చేశాడు. వారు ఇంటికి వచ్చిన సమయంలో ఫ్రిజ్లో నుంచి వాటిని తీసి కిచెన్లో దాచిపెట్టేవాడు.
ఇంకా దొరకని తల..
మే 18న శ్రద్ధాను చంపిన తర్వాత కూడా ఆమె గూగుల్ అకౌంట్ను ఉపయోగించినట్లు వెల్లడైంది. కొన్ని రోజుల తర్వాత సెల్ఫోన్తోపాటు ఆమె లిప్స్టిక్ను ముంబయిలో పడేసినట్లు దిల్లీ పోలీసులు దాఖలు చేసిన 6వేల పేజీల ఛార్జిషీట్లో వెల్లడించారు. ఇప్పటివరకు 20 శరీర ముక్కలను స్వాధీనం చేసుకోగా.. తల మాత్రం ఇంకా లభించక పోవడం గమనార్హం. ఈ కేసులో ఆఫ్తాబ్కు ఇప్పటికే పాలిగ్రఫీ, నార్కో పరీక్షలు కూడా పూర్తికాగా.. అందులో నేరాన్ని అంగీకరించాడు. అయినప్పటికీ బలమైన సాక్ష్యాధారాలను న్యాయస్థానం ముందు ఉంచేందుకు దర్యాప్తు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
రాష్ట్రంలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పెళ్లి కుమార్తెను తీసుకొచ్చేందుకు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా
తెల్లవారితే తమ సమీప బంధువు ఇంట్లో జరిగే వివాహ వేడుకలో ఉత్సాహంగా పాల్గొనేవారు. ఇంతలోనే జరిగిన ప్రమాదం ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. -
పహల్ ఫుడ్స్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
రాజేంద్రనగర్ పరిధి కాటేదాన్లోని పహల్ ఫుడ్స్ కంపెనీలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. -
మద్యానికి రూ.70 ఇవ్వలేదని కత్తిపోట్లు
మద్యం తాగేందుకు రూ.70 ఇవ్వలేదనే కారణంతో అందరూ చూస్తుండగానే స్నేహితుడిని కత్తితో పొడిచిన సంఘటన విజయవాడలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. -
చంద్రబాబు సభకు వెళ్లారని.. తెదేపా కార్యకర్తపై వైకాపా వర్గీయుడి దాడి
తెదేపా అధినేత చంద్రబాబు బహిరంగ సభకు వెళ్లాడన్న అక్కసుతో ఆ పార్టీ కార్యకర్తపై అధికార వైకాపా వర్గీయుడు దాడికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో మంగళవారం రాత్రి చోటు చేసుకొంది. -
సీఎంఆర్ఎఫ్ సొమ్ము రూ.10.50 లక్షలు స్వాహా
బాధితులకు అందాల్సిన ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్ఎఫ్) చెక్కుల సొమ్ము రూ.10.50 లక్షలను కాజేసిన నలుగుర్ని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. -
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్య ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లింది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని చీపురుబట్టీ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు- మావోయిస్టుల మధ్య బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య
తమిళనాడులోని మదురై నుంచి వచ్చి జనగామలో స్థిరపడిన దంపతులు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. జనగామ పట్టణ సీఐ రఘుపతిరెడ్డి ఈ వివరాలు తెలిపారు. -
ఫోన్లో గట్టిగా మాట్లాడొద్దన్నందుకు కుమారుడిపై తండ్రి దాడి
ఫోన్లో గట్టిగా అరుస్తూ మాట్లాడొద్దని చెప్పినందుకు ఓ తండ్రి తన కుమారుడిపై తీవ్రంగా దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటన మహారాష్ట్రలోని నాగ్పుర్ జిల్లాలో చోటుచేసుకుంది. -
‘గ్రూప్-1’ ఉద్యోగాల పేరిట టోకరా!
నిరుద్యోగుల బలహీనతలను ఆసరాగా చేసుకొన్న ఓ ముఠా ‘గ్రూప్-1’ ఉద్యోగాల పేరుతో పలువురికి టోకరా వేసిన వైనం వెలుగులోకి వచ్చింది. -
తేనెటీగల దాడిలో పశువుల కాపరి మృతి
తేనెటీగల దాడిలో పశువుల కాపరి మృతిచెందిన సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. -
13 క్వింటాళ్ల పేలుడు పదార్థాల పట్టివేత
మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్స్టేషన్ పరిధిలో 13 క్వింటాళ్ల పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. -
ఓక్రా, ఫైజల్ కస్టడీకి అనుమతి
పంజాగుట్ట డ్రగ్స్ కేసులో నిందితుడు నైజీరియా వాసి ఆంటోనియో ఒబింటా అలియాస్ ఓక్రాను నాలుగు రోజుల కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలిచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!