కేజిన్నర బంగారం చేతులకు చుట్టుకుని.. కస్టమ్స్కు చిక్కిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఉద్యోగి!
Air India Express- smuggling: సాధారణంగా ఇతర దేశాల నుంచి ప్రయాణికులు బంగారాన్ని దేశంలోకి అక్రమంగా తరలించిన ఘటనలు తరచూ చూస్తుంటాం. తాజాగా ఓ విమానయాన సంస్థకు చెందిన ఉద్యోగే స్మగ్లింగ్కు పాల్పడిన ఘటన వెలుగుచూసింది.
కోచి: ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (Air India Express)కు చెందిన ఓ ఉద్యోగి దాపు కేజిన్నర బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ కస్టమ్స్ అధికారుల చేతికి చిక్కాడు. ఆ బంగారాన్ని తన చేతులకు చుట్టుకుని స్మగ్లింగ్ (smuggling) చేసేందుకు ప్రయత్నించగా.. అధికారులు అతడిని పట్టుకున్నారు. కేరళలోని కొచ్చిన్ (Cochin) అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
బహ్రెయిన్ నుంచి కోజికోడ్ మీదుగా ఓ ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (Air India Express) విమానం కోచి ఎయిర్పోర్టుకు చేరుకుంది. ఆ విమానంలో కేబిన్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న షఫీ అనే వ్యక్తి.. బంగారాన్ని స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కస్టమ్స్ ప్రివెంటివ్ కమిషనరేట్కు రహస్య సమాచారం అందింది. దీంతో కస్టమ్స్ అధికారులు అతడిపై నిఘా పెట్టారు. ఎయిర్పోర్టులో విమానం ల్యాండ్ అయిన తర్వాత గ్రీన్ ఛానల్ నుంచి హడావుడిగా వెళ్తున్న షఫీని పట్టుకోగా.. ఈ స్మగ్లింగ్ వ్యవహారం బయటపడింది. పేస్ట్ రూపంలో ఉన్న 1487 గ్రాముల బంగారాన్ని షఫీ తన రెండు చేతులకు చుట్టుకున్నాడు. అది బయటకు కనిపించకుండా స్లీవ్స్ను కప్పి ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఆ బంగారం విలువ దాదాపు రూ.75 లక్షలు ఉంటుందని వెల్లడించారు.
ఈ ఘటనపై ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ఉద్యోగిని తక్షణమే సస్పెండ్ చేసినట్లు తెలిపింది. ‘‘అలాంటి ప్రవర్తనను మా సంస్థ ఎన్నటికీ సహించబోదు. దర్యాప్తు నివేదిక వచ్చిన తర్వాత ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే విధుల నుంచి తొలగించేందుకు కూడా వెనుకాడబోం’’ అని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఆ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం ఈ ఘటనపై కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి