కేజిన్నర బంగారం చేతులకు చుట్టుకుని.. కస్టమ్స్కు చిక్కిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఉద్యోగి!
Air India Express- smuggling: సాధారణంగా ఇతర దేశాల నుంచి ప్రయాణికులు బంగారాన్ని దేశంలోకి అక్రమంగా తరలించిన ఘటనలు తరచూ చూస్తుంటాం. తాజాగా ఓ విమానయాన సంస్థకు చెందిన ఉద్యోగే స్మగ్లింగ్కు పాల్పడిన ఘటన వెలుగుచూసింది.
కోచి: ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (Air India Express)కు చెందిన ఓ ఉద్యోగి దాపు కేజిన్నర బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ కస్టమ్స్ అధికారుల చేతికి చిక్కాడు. ఆ బంగారాన్ని తన చేతులకు చుట్టుకుని స్మగ్లింగ్ (smuggling) చేసేందుకు ప్రయత్నించగా.. అధికారులు అతడిని పట్టుకున్నారు. కేరళలోని కొచ్చిన్ (Cochin) అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
బహ్రెయిన్ నుంచి కోజికోడ్ మీదుగా ఓ ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (Air India Express) విమానం కోచి ఎయిర్పోర్టుకు చేరుకుంది. ఆ విమానంలో కేబిన్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న షఫీ అనే వ్యక్తి.. బంగారాన్ని స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కస్టమ్స్ ప్రివెంటివ్ కమిషనరేట్కు రహస్య సమాచారం అందింది. దీంతో కస్టమ్స్ అధికారులు అతడిపై నిఘా పెట్టారు. ఎయిర్పోర్టులో విమానం ల్యాండ్ అయిన తర్వాత గ్రీన్ ఛానల్ నుంచి హడావుడిగా వెళ్తున్న షఫీని పట్టుకోగా.. ఈ స్మగ్లింగ్ వ్యవహారం బయటపడింది. పేస్ట్ రూపంలో ఉన్న 1487 గ్రాముల బంగారాన్ని షఫీ తన రెండు చేతులకు చుట్టుకున్నాడు. అది బయటకు కనిపించకుండా స్లీవ్స్ను కప్పి ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఆ బంగారం విలువ దాదాపు రూ.75 లక్షలు ఉంటుందని వెల్లడించారు.
ఈ ఘటనపై ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ఉద్యోగిని తక్షణమే సస్పెండ్ చేసినట్లు తెలిపింది. ‘‘అలాంటి ప్రవర్తనను మా సంస్థ ఎన్నటికీ సహించబోదు. దర్యాప్తు నివేదిక వచ్చిన తర్వాత ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే విధుల నుంచి తొలగించేందుకు కూడా వెనుకాడబోం’’ అని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఆ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం ఈ ఘటనపై కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంజాయి మిల్క్షేక్!.. మత్తు ముఠాల నయా దందా
గంజాయి విక్రేతలు కొత్త పంథా అనుసరిస్తున్నారు. హ్యాష్ ఆయిల్.. చాక్లెట్లుగా మార్చి విక్రయించడం పాత ట్రెండు.. ఇప్పుడు గంజాయిని పొడిగా చేసి విక్రయిస్తున్నారు. -
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని నార్కట్పల్లి-అద్దంకి రహదారి నల్గొండ జిల్లా కేంద్రంలో భారాస నాయకుడు మృతిచెందారు. -
ప్రకాశం జిల్లాలో మద్యం డంప్ స్వాధీనం
ప్రకాశం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్శి సెబ్ కార్యాలయంలో ఎస్పీ గరుడ్ సుమిత్సునీల్ బుధవారం వివరాలను వెల్లడించారు. -
మావోయిస్టులకు శరాఘాతం!
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఉత్తర బస్తర్ డివిజన్ కమిటీ భారీ మూల్యం చెల్లించుకుంది. -
జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది పరారీ
కిటికీ గ్రిల్స్ తొలగించి జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది బాలురు పరారైన ఘటన మేడ్చల్ జిల్లా గాజులరామారంలో సంచలనం సృష్టించింది. -
తప్పుడు ప్రకటనలతో మందుల విక్రయం
జ్వరాన్ని నయం చేస్తుందని తప్పుడు ప్రకటనలతో విక్రయిస్తున్న మందులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
గుజరాత్లో రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం
గుజరాత్లో ఆగివున్న చమురు ట్యాంకర్ను వేగంగా వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా 10 మంది దుర్మరణం చెందినట్లు పోలీసులు తెలిపారు. -
అనంత్నాగ్లో బిహార్ కూలీని కాల్చిచంపిన ఉగ్రవాదులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రవాదులు మరోమారు పేట్రేగిపోయారు. బుధవారం అనంత్నాగ్ జిల్లాలో బిహార్కు చెందిన కూలీని కాల్చి చంపారు.