Road Accident: మధ్యప్రదేశ్‌లో అమానవీయం.. రోడ్డు ప్రమాదాన్ని చూసినా పట్టించుకోలేదు!

మధ్యప్రదేశ్‌లో అమానవీయ ఘటన జరిగింది. అలీరాజ్‌పూర్‌లో ఆదివారం రాత్రి ఓ యువకుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.

Published : 25 Jan 2022 01:38 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో అమానవీయ ఘటన జరిగింది. అలీరాజ్‌పూర్‌లో ఆదివారం రాత్రి ఓ యువకుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనను కొందరు స్థానికులు చూసి కూడా పట్టించుకోకపోవడంతో .. అతడు ప్రాణాలు కోల్పోయాడు. కారుకు దారి ఇచ్చే క్రమంలో యువకుడు బైక్‌పై నుంచి అకస్మాత్తుగా కింద పడిపోయాడు.  మొదట అతడికి సహాయం చేయడానికి వచ్చిన కొందరు స్థానికులు.. అతడిని లేపే ప్రయత్నం చేశారు. కానీ, ఆ యువకుడు లేవలేదు. దీంతో ఆ యువకుడిని అక్కడే వదిలి వెళ్లిపోయారు. అంబులెన్స్, పోలీసులకు సైతం సమాచారం ఇవ్వలేదు. ఉదయం అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్ధలికి చేరుకుని పరిశీలించగా.. యువకుడు చనిపోయి కనిపించాడు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని