ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కారు: ఆర్మీ జవాన్‌ మృతి

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం రంగంపేట క్రాస్‌ రోడ్డు వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆర్మీ జవాన్‌

Published : 11 Jul 2021 01:04 IST

పూతలపట్టు: చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం రంగంపేట క్రాస్‌ రోడ్డు వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆర్మీ జవాన్‌ మృతి చెందాడు. ఆర్మీ జవాన్‌ రంగంపేటకు చెందిన మనోజ్‌(28)గా పోలీసులు గుర్తించారు. మనోజ్‌ 25 రోజుల క్రితం సెలవులపై స్వగ్రామానికి వచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని