వైకాపా నేతల వేధింపులు..ఆశా కార్యకర్త ఆత్మహత్యాయత్నం

వైకాపా నాయకులు లైంగికంగా వేధిస్తున్నారంటూ అనంతపురం జిల్లా చెర్లోపల్లికి చెందిన ఓ ఆశా కార్యకర్త ఆత్మహత్యకు యత్నించింది. అదే గ్రామానికి చెందిన వైకాపా నాయకులు ఆదినారాయణ, వరదప్ప, రామచంద్ర, సురేశ్‌ తనను నిత్యం వేధిస్తున్నారని వాపోయింది.

Published : 20 Apr 2021 01:16 IST

రాప్తాడు: వైకాపా నాయకులు లైంగికంగా వేధిస్తున్నారంటూ అనంతపురం జిల్లా చెర్లోపల్లికి చెందిన ఓ ఆశా కార్యకర్త ఆత్మహత్యకు యత్నించింది. అదే గ్రామానికి చెందిన వైకాపా నాయకులు ఆదినారాయణ, వరదప్ప, రామచంద్ర, సురేశ్‌ తనను నిత్యం వేధిస్తున్నారని వాపోయింది. తమతో గడపాలని, లేదంటే ఉద్యోగాన్ని తీసేయిస్తామని బెదిరించేవారని పేర్కొంది. వారి వేధింపులు తట్టుకోలేకే మనస్తాపం చెంది వాస్మోల్‌ నూనె తాగి ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిపింది. ఈ ఘటనపై బాధితురాలి వాంగ్మూలం తీసుకున్న రాప్తాడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని