TS News: పోలీసు వాహనం, ఇసుక లారీ ఢీ.. ఏఎస్సై మృతి 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోలీస్ వాహనం, ఇసుక లారీ ఢీకొన్న ఘటనలో ఏఎస్సై మృతిచెందారు. గణపురం మండలం గాంధీనగరం వద్ద ఆగి ఉన్న లారీని

Updated : 07 Nov 2021 15:35 IST

గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోలీస్ వాహనం, ఇసుక లారీ ఢీకొన్న ఘటనలో ఏఎస్సై మృతిచెందారు. గణపురం మండలం గాంధీనగరం వద్ద ఆగి ఉన్న లారీని.. పెట్రోలింగ్‌కు వెళ్తున్న పోలీస్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో.. వాహనంలో ఉన్న హరిలాల్ సహా ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్రగాయాలయ్యాయి. హరిలాల్ పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే హరిలాల్  ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని