లోయలో పడిన ట్రక్కు.. 10 మంది మృతి 

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇత్వా జిల్లాలో ఓ ట్రక్కు లోయలో పడిన ఘటనలో 10మంది మృత్యువాతపడ్డారు.....

Published : 11 Apr 2021 02:09 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇటావా జిల్లా పరిధిలో ఓ ట్రక్కు లోయలో పడిపోవటంతో 10 మంది మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటనలో మరో 30 నుంచి 35 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామని పోలీసులు వెల్లడించారు. బర్హపుర పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రవెనే ప్రాంతంలో డ్రైవర్‌ ఆ ట్రక్కుపై నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ఘటన జరిగిందని అదనపు ఎస్పీ ప్రశాంత్‌ కుమార్‌ ప్రసాద్‌ తెలిపారు. ప్రమాదం సమయంలో ఈ ట్రక్కులో 40 నుంచి 50 మంది ఉన్నట్టు తెలిపారు. మృతులంతా పురుషులే అని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని