కశ్మీర్‌లో మిలిటెంట్ల గ్రనేడ్‌ దాడి..!

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్‌ బార్బర్‌షా ప్రాంతంలోని క్రాల్‌ఖుద్‌ పోలీస్ ఠాణా సమీపంలో శనివారం

Published : 27 Jun 2021 01:10 IST

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్‌ బార్బర్‌షా ప్రాంతంలోని క్రాల్‌ఖుద్‌ పోలీస్ ఠాణా సమీపంలో శనివారం సాయంత్రం సీఆర్‌పీఎఫ్‌, పోలీసు బలగాలను లక్ష్యంగా చేసుకొని గ్రనేడ్‌తో దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు పోలీసులు వివరాలు వెల్లడించారు. ముష్కరులు విసిరిన గ్రనేడ్ గురి తప్పి రోడ్డు పక్కన పేలడంతో అటుగా వెళ్తున్న ముగ్గురు స్థానికులు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. దాడికి పాల్పడిన ఉగ్రమూకను పట్టుకునేందుకు భద్రతా దళాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని