AP News: ఒంగోలులో పెట్రోలు బాంబు దాడి!
ఆర్థిక విభేదాలతో ఒంగోలులోని ఓ ఇంటిపై పెట్రోలు బాంబులు విసరడం కలకలం రేపింది.
ఒంగోలు: ఆర్థిక విభేదాలతో ఒంగోలులోని ఓ ఇంటిపై పెట్రోలు బాంబులు విసరడం కలకలం రేపింది. రెవెన్యూ కాలనీలోని కుంచాల మహేశ్ ఇంటిపై సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుండగులు పెట్రోలు బాంబులు విసిరారు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇంటి ఆవరణలోని కొన్ని వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. ఇంటి యజమాని మహేశ్కు ఒంగోలు, గుంటూరుకు చెందిన కొందరి మధ్య గత కొంతకాలంగా ఆర్థిక విభేదాలు నడుస్తున్నాయి. దీనిపై ఒంగోలు తాలూకా పోలీస్స్టేషన్లో కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలోనే పెట్రోలు బాంబు దాడి జరిగినట్లు మహేశ్కుటుంబం ఆరోపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్