రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్‌ నరకయాతన

రోడ్డు ప్రమాదంలో ఓ ఆటో డ్రైవర్‌ నరకయాతన అనుభవించాడు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి వద్ద ఓ ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్‌ ఆటోలోనే ఇరుక్కుపోయాడు....

Published : 28 Mar 2021 01:13 IST

జగిత్యాల: రోడ్డు ప్రమాదంలో ఓ ఆటో డ్రైవర్‌ నరకయాతన అనుభవించాడు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి వద్ద ఓ ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్‌ ఆటోలోనే ఇరుక్కుపోయాడు. అరగంటపాటు నరకయాతన అనుభవించాడు. ఆటో ముందుభాగం నుజ్జునుజ్జవగా డ్రైవర్‌ బయటకు రాలేకపోయాడు. స్థానికులు బయటకు తీసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరకు క్రేన్‌ సాయంతో ఆటో డ్రైవర్‌ను రక్షించి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆర్టీసీ డ్రైవర్‌ అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు పేర్కొన్నారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని