Hyderabad: బేగంబజార్ హత్య కేసు.. అదుపులో ఆరుగురు నిందితులు
నగరంలోని బేగంబజార్ పరువుహత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నీరజ్ హత్య కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అభినందన్,
హైదరాబాద్: నగరంలోని బేగంబజార్ పరువుహత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నీరజ్ హత్య కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అభినందన్, విజయ్, సంజయ్, రోహత్, మహేశ్, ఒక బాలుడిని అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ జోయల్ డేవిస్ మీడియాకు వెల్లడించారు.
డీసీపీ మాట్లాడుతూ.. ‘‘సంజన పెద్దనాన్న కుమారులు నీరజ్ను చంపేశారు. నీరజ్ను హత్య చేసేందుకు గాను 15 రోజులుగా కుట్ర చేశారు. నిందితులు జుమేరాత్ బజార్లో కత్తులు కొన్నారు. నీరజ్ కదలికలను గత కొన్ని రోజులుగా పరిశీలించారు. నీరజ్ ప్రేమ వివాహం చేసుకొని షంషేర్నగర్లో ఉంటున్నారు. నీరజ్, సంజన ప్రేమ వివాహం యువతి ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు. వివాహం అనంతరం సంజనతో ఎలాంటి సంబంధం లేదని ఆమె కుటుంబసభ్యులు వదిలేశారు. పెద్దనాన్న కుమారులు మాత్రం పరువు పోయినట్లు భావించారు. ప్రాణాపాయం ఉందని గతేడాది పెళ్లి చేసుకున్నప్పుడే నీరజ్, సంజన ఫిర్యాదు చేశారు. అప్పుడే ఇరు వర్గాలను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించాం.
నీరజ్ వాళ్లకు పల్లీల వ్యాపారం ఉంది. నీరజ్ ఎక్కువగా షాపుకు రావడం.. నిందితుల ఇల్లు కూడా సమీపంలోనే ఉండటం వల్ల ఈ మధ్య వారు ఎక్కువగా ఎదురు పడటం జరిగింది. పదే పదే నీరజ్ను ఇంటి సమీపంలో చూసి నిందితులు తట్టుకోలేకపోయారు. అలా ఆవేశంలో, తాగిన మత్తులో తీసుకున్న నిర్ణయం ప్రకారం నీరజ్ను హతమార్చారు. నిందితుడిగా గుర్తించిన వారిలో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈ కేసులో సంజన కుటుంబసభ్యుల ప్రమేయం ఇప్పటివరకు బయటపడలేదు. ప్రస్తుతం ఆరుగురు కలిసి హత్య చేసినట్లు గుర్తించాం. నిందితులను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. తద్వారా ఈ కేసులో ఇంకెవరికైనా ప్రమేయం ఉందా అనే విషయం తేలుతుంది. పరువు హత్య అన్నట్లు ఆధారాలు లభించలేదు’’ అని డీసీపీ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ