Mancherial: అర్ధరాత్రి మద్యం మత్తులో ఎస్సై వీరంగం

మంచిర్యాల పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద మద్యం మత్తులో ఓ ఎస్సై వీరంగం సృష్టించారు. మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

Updated : 26 Oct 2022 11:07 IST

మంచిర్యాల నేరవిభాగం: మంచిర్యాల పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద మద్యం మత్తులో ఓ ఎస్సై వీరంగం సృష్టించారు. మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని బెజ్జంకి పోలీసు స్టేషన్‌ ఎస్సై తిరుపతి తన స్నేహితులతో కలిసి హల్‌చల్‌ చేశారు. మద్యం మత్తులో రోడ్డుపై అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీరిపై స్థానికులు డయల్‌ 100కు ఫిర్యాదు చేశారు.

సమాచారం అందుకున్న బ్లూకోట్‌ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని వారిని అక్కడినుంచి పంపించే ప్రయత్నం చేశారు. మద్యం మత్తులో ఎస్సైతోపాటు అతడి స్నేహితులు బ్లూకోట్‌ సిబ్బందిపైనా దాడి చేశారు. వారి వద్ద ఉన్న ట్యాబ్‌లను ధ్వంసం చేశారు. అనంతరం బ్లూకోట్‌ సిబ్బంది ఎస్సైకి సంబంధించిన కారును స్థానిక పోలీసుస్టేషన్‌కు తరలించి ఫిర్యాదు చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు