థాయ్లాండ్లో ఘోర ప్రమాదం:17మంది మృతి
థాయ్లాండ్లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తూ బస్సును రైలు ఢీకొట్టడంతో 17 మంది మృతి చెందారు. మరో 29 మంది వరకు గాయపడినట్లు...
మరో 29 మందికి గాయాలు
చాచియాంగ్సావో: థాయ్లాండ్లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తూ బస్సును రైలు ఢీకొట్టడంతో 17 మంది మృతి చెందారు. మరో 29 మంది వరకు గాయపడినట్లు థాయ్ అధికారులు వెల్లడించారు. బ్యాంకాక్ నుంచి చాచియాంగ్ సావోలోని ఆలయం వద్దకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. 65 మందితో వెళ్తున్న పర్యాటక బస్సు రైల్వే ట్రాక్ను దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టినట్లు వివరించారు. వర్షం పడుతుండటంతో రైలు వస్తున్నట్లు బస్సు డ్రైవర్ గుర్తించకపోవడంతోనే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించాయి.
రైల్వే ట్రాక్ల పక్కన మృతదేహాలు చెల్లాచెదురుగా పడి భయానక వాతావరణం నెలకొంది. రైలు ఢీకొనడంతో బస్సు తిరగబడిందని క్రేన్ సాయంతో యథాస్థితిలోకి తెచ్చినట్లు అధికారులు చెప్పారు. క్షతగాత్రుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. 2018లో డబ్ల్యూహెచ్వో లెక్కల ప్రకారం.. ప్రమాదాల వల్ల అత్యధిక మరణాలు సంభవించిన దేశాల్లో థాయ్లాండ్ రెండో స్థానంలో నిలిచింది. ద్విచక్ర వాహనదారులు, బస్సు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతుంటారని పేర్కొంది. రెండేళ్ల కిందట చెట్టును బస్సు ఢీకొట్టిన ఘటనలో 18 మంది మృతి చెందగా.. పది మందికిపైగా గాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మెదక్ జిల్లాలో పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా: ఇద్దరి మృతి
ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లాలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. -
జూబ్లీహిల్స్ పోలీసుల అదుపులో హరీశ్రావు మాజీ పీఏ
ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కుల కేసులో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఫోన్లో గట్టిగా మాట్లాడొద్దన్నందుకు కుమారుడిని చంపిన తండ్రి
ఫోన్లో గట్టిగా అరుస్తూ మాట్లాడొద్దని చెప్పినందుకు మద్యం మత్తులో ఓ తండ్రి తన కుమారుడిని హత్య చేశాడు. -
వృద్ధురాలిపై చెప్పుతో దాడి
తాము చెప్పిన సంఖ్య కంటే ఎక్కువమంది మహిళలను ఎన్నికల ప్రచారానికి తీసుకొచ్చిందన్న కారణంతో ఓ వృద్ధురాలిపై వైకాపా కదిరి అభ్యర్థి మక్బూల్ అహమ్మద్ సమీప బంధువు పరికి షామీర్బాషా అసభ్య పదజాలంతో దూషిస్తూ చెప్పుతో దాడి చేశాడు. -
ఇసుకాసురుల కాసుల వేటలో.. మరో యువకుడు బలి
వైకాపా నాయకుల అండదండలతో ఇష్టారాజ్యంగా చేపడుతున్న ఇసుక తవ్వకాలతో మరో యువకుడు మృతిచెందారు. -
అనిశాకు చిక్కిన ఎంపీడీవో, సీనియర్ అసిస్టెంట్
లంచం తీసుకున్న కేసులో ఎంపీడీవో, సీనియర్ అసిస్టెంట్లను అరెస్టు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ నిజామాబాద్ జిల్లా డీఎస్పీ శేఖర్ తెలిపారు. -
గోవా జైల్లో ఉన్న డ్రగ్ డాన్ ఫైజల్ అరెస్టు
పంజాగుట్ట డ్రగ్స్ కేసులో మరో ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. గోవా డ్రగ్స్ నెట్వర్క్లో కీలకంగా వ్యవహరించే నైజీరియన్ ఇవాల ఉడోక స్టాన్లీకి సహచరుడు మహ్మద్ ఉస్మాన్ అలియాస్ ఫైజల్(29)ను తాజాగా అదుపులోకి తీసుకున్నారు. -
ఇఫ్తార్ ముగించి ఇంటికొస్తున్న బాలుడి కిడ్నాప్.. దారుణహత్య
మహారాష్ట్రలోని ఠాణె సమీప గోరేగావ్లో డబ్బు కోసం తొమ్మిదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి, మృతదేహాన్ని గోనెసంచిలో కుక్కిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. -
మహిళ ఆత్మహత్య.. పక్కింట్లో మరో మహిళ హత్య!
ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన కొద్ది సమయానికే పక్కింటి మహిళ హత్యకు గురవడం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కమలాపూర్లో కలకలం సృష్టించింది. -
భారీ రాబడులంటూ కోటికి పైగా కొట్టేశారు.. వెలుగులోకి ఫేక్ స్టాక్ మార్కెట్ స్కామ్!
Scam Alert: స్టాక్ మార్కెట్ పెట్టుబడుల్లో పెద్ద మొత్తంలో స్థిరమైన ఆదాయం అంటూ మోసగాళ్లు కొత్త తరహా మోసానికి పాల్పడిన ఉదంతం ఇదీ..
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్లో చేరిన భారాస నేతలు, కార్యకర్తలు
-
నవనీత్ రాణాకు భాజపా టికెట్ .. ఆ సీటు నుంచే బరిలోకి..
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
-
హైదరాబాద్ సంచలనం.. ఐపీఎల్ రికార్డు బద్దలు
-
తెదేపా అభ్యర్థుల్ని ప్రకటించాల్సిన స్థానాలివే!