Uttarakhand: రిసార్టులో రిసెప్షనిస్ట్ హత్య.. భాజపా నేత కుమారుడి అరెస్ట్
ఉత్తరాఖండ్లో దారుణం చోటుచేసుకుంది. ఓ రిసార్టులో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న 19ఏళ్ల యువతి హత్యకు గురికావడం కలకలం రేపింది.
పౌరీ: ఉత్తరాఖండ్లో దారుణం చోటుచేసుకుంది. ఓ రిసార్టులో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న 19ఏళ్ల యువతి హత్యకు గురికావడం కలకలం రేపింది. అయితే, ఈ వ్యవహారంలో రిసార్టు యజమానే ఈ దారుణానికి పాల్పడినట్లు వెల్లడైంది. దీంతో అతడితోపాటు అదే రిసార్టులో పనిచేస్తోన్న మరో ఇద్దరు సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు.
ఉత్తరాఖండ్ హరిద్వార్కు చెందిన వినోద్ ఆర్య అనే ఓ భాజపా నేతకు పౌరీ జిల్లాలో ఓ రిసార్టు ఉంది. అందులో పనిచేస్తున్న 19 ఏళ్ల యువతి గత కొంతకాలంగా కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఐతే ఆ యువతిని భాజపా నేత కుమారుడు, రిసార్టు యజమానిగా ఉన్న పులకిత్ ఆర్య, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్లు కలిపి హతమార్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం మృతదేహాన్ని సమీప కాలవలో పడేసినట్లు నిందితులు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.
నిందితులు చెప్పిన వివరాల ప్రకారం అమ్మాయి మృతదేహాన్ని కనుగొనేందుకు ప్రత్యేక బృందంతో కాలవలో గాలింపు చేపట్టినట్లు పౌరీ ఎసీపీ శేఖర్ చంద్ర సుయాల్ వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా.. వారికి 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించినట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం