కెమికల్‌ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఆరుగురు కార్మికుల మృతి

గుజరాత్‌లోని కెమికల్‌ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలోఆరుగురు కార్మికులు మృతి చెందారు.

Published : 11 Apr 2022 12:09 IST

 

గాంధీనగర్‌: గుజరాత్‌ రాష్ట్రంలోని భరూచ్‌ ప్రాంతంలోని ఓ కెమికల్‌ ఫ్యాక్టరీలో సోమవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు మృతి చెందారు. భరూచ్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ లీనా పాటిల్‌ కథనం ప్రకారం.. అహ్మదాబాద్‌కి 235 కిలోమీటర్ల దూరంలో ఉన్న దహేజ్‌ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న యూనిట్‌లో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా రియాక్టర్‌ పేలడంతో పెద్దగా మంటలు వ్యాపించాయి. దీనికి దగ్గరగా పని చేస్తోన్న ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు.  ఘటనాస్థలికి చేరుకున్న అగ్ని మాపకసిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని