బెంగాల్‌లో పేలుడు.. ఐదుగురు మృతి

పశ్చిమబెంగాల్‌లో గురువారం భారీ పేలుడు ప్రమాదం చోటుచేసుకుంది. మాల్డా జిల్లాలోని సుజాపూర్‌ ప్రాంతంలోని ప్లాస్టిక్‌ పరిశ్రమలో పేలుడు సంభవించడంతో ఐదుగురు మరణించారు. మరో ముగ్గురు తీవ్రగాయాల పాలయ్యారు.

Updated : 19 Nov 2020 16:18 IST

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో గురువారం భారీ పేలుడు ప్రమాదం చోటుచేసుకుంది. మాల్డా జిల్లాలోని సుజాపూర్‌ ప్రాంతంలోని ప్లాస్టిక్‌ పరిశ్రమలో పేలుడు సంభవించడంతో ఐదుగురు మరణించారు. మరో ముగ్గురు తీవ్రగాయాల పాలయ్యారు. కాగా ఈ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్‌ బందోపాధ్యాయ స్పందిస్తూ.. ‘బాధితులను తక్షణమే ఆదుకోవాలని సీఎం మమతా బెనర్జీ ఆదేశించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబానికి రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50వేలు నష్టపరిహారం అందిస్తాం. జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, సీనియర్‌ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీస్తున్నారు. ప్లాస్టిక్‌ వస్తువులు తయారీ చేస్తుండగా ఘటన జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి  మెరుగైన చికిత్స అందజేస్తున్నాం’అని బందోపాధ్యాయ్‌ తెలిపారు. ఈ ఘటన గురువారం ఉదయం 11గంటల ప్రాంతంలో చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై విచారణ కొనసాగుతున్నట్లు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని