బెంగాల్లో పేలుడు.. ఐదుగురు మృతి
పశ్చిమబెంగాల్లో గురువారం భారీ పేలుడు ప్రమాదం చోటుచేసుకుంది. మాల్డా జిల్లాలోని సుజాపూర్ ప్రాంతంలోని ప్లాస్టిక్ పరిశ్రమలో పేలుడు సంభవించడంతో ఐదుగురు మరణించారు. మరో ముగ్గురు తీవ్రగాయాల పాలయ్యారు.
కోల్కతా: పశ్చిమబెంగాల్లో గురువారం భారీ పేలుడు ప్రమాదం చోటుచేసుకుంది. మాల్డా జిల్లాలోని సుజాపూర్ ప్రాంతంలోని ప్లాస్టిక్ పరిశ్రమలో పేలుడు సంభవించడంతో ఐదుగురు మరణించారు. మరో ముగ్గురు తీవ్రగాయాల పాలయ్యారు. కాగా ఈ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బందోపాధ్యాయ స్పందిస్తూ.. ‘బాధితులను తక్షణమే ఆదుకోవాలని సీఎం మమతా బెనర్జీ ఆదేశించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబానికి రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50వేలు నష్టపరిహారం అందిస్తాం. జిల్లా కలెక్టర్, ఎస్పీ, సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీస్తున్నారు. ప్లాస్టిక్ వస్తువులు తయారీ చేస్తుండగా ఘటన జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందజేస్తున్నాం’అని బందోపాధ్యాయ్ తెలిపారు. ఈ ఘటన గురువారం ఉదయం 11గంటల ప్రాంతంలో చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై విచారణ కొనసాగుతున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?