Telangana News: చిత్తు కాగితాలు సేకరిస్తుండగా పేలుడు.. మహిళ మృతి

Published : 27 Feb 2022 11:09 IST

మైలార్‌దేవ్‌పల్లి: చిత్తు కాగితాలు సేకరిస్తుండగా పేలుడు సంభవించి ఓ మహిళ మృతిచెందిన ఘటన రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో ఈ ఉదయం దంపతులు చిత్తు కాగితాలు సేకరణకు వెళ్లారు. కాగితాలు సేకరిస్తున్న సమయంలో ఉన్నట్టుండి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మహిళ మృతిచెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి ఘటనాస్థలికి చేరుకున్నారు. పేలుడుకు గల కారణాలపై ఆరా తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు