Crime News: ఉస్మానియా ఆస్పత్రికి జైహింద్‌ నాయక్‌ మొండెం

నల్గొండ జిల్లాలో జైహింద్‌ నాయక్‌ (30) అనే మతి స్థిమితం లేని వ్యక్తి దారుణహత్య కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

Updated : 14 Jan 2022 16:29 IST

హైదరాబాద్‌: నల్గొండ జిల్లాలో జైహింద్‌ నాయక్‌ (30) అనే మతి స్థిమితం లేని వ్యక్తి దారుణహత్య కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లోని ఓ భవనంపై పోలీసులు జైహింద్‌ నాయక్‌ మొండెం గుర్తించారు. మూడు రోజుల క్రితం నల్గొండ జిల్లా చింతపల్లి మండలం నాగార్జున సాగర్‌, హైదరాబాద్‌ జాతీయ రహదారి పక్కనే విరాట్‌నగర్‌ కాలనీలో మెట్టు మహంకాళీ అమ్మవారి విగ్రహం వద్ద దుండగులు మొండెం లేని జైహింద్‌ నాయక్‌ తలను ఉంచారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాజాగా జైహింద్‌ మొండెంను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌తో ఘటనా స్థలంలో పలు ఆధారాలు సేకరించారు. నిందితుల ఆచూకీ కోసం సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని