Bomb explode: బంతి అనుకొని బాంబుతో ఆడి...

బంతి అనుకొని బాంబుతో ఆడుకొని ఆసుపత్రిలో చేరారు ఐదుగురు పిల్లలు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండగా మరో ఇద్దరు కోలుకుంటున్నారు. 

Published : 25 Apr 2022 10:50 IST

కోల్‌కతా: బాంబును బంతిగా భ్రమించి.. దానితో ఆడుకొని ఐదుగురు పిల్లలు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండగా మరో ఇద్దరు కోలుకొంటున్నారు. పశ్చిమబెంగాల్‌లోని కలియాచక్‌ ప్రాంతంలో ఉన్న మామిడి తోటలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బాంబులను దాచారు. ఆదివారం సాయంత్రం ఐదుగురు పిల్లలు వాటిని చూసి బంతులుగా భ్రమించారు. వాటితో ఆడుకొనేందుకు ప్రయత్నించగా.. అవి పేలి వారు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని స్థానికులు మాల్దా మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో చేర్పించారు. మరో ఇద్దరికి కలియాచక్‌లోని ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. ఆ ప్రదేశంలో మిగిలిన బాంబులను సోమవారం పేల్చేస్తామని వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని