Bomb Threat: బళ్లారి ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు.. తనిఖీలు చేపట్టిన పోలీసులు

బళ్లారి ఎక్స్‌ప్రెస్‌లో బాంబు ఉందంటూ బుధవారం రాత్రి వచ్చిన ఫోన్‌కాల్‌ కలకలం రేపింది. పోలీసులు, బాంబు, డాగ్‌స్క్వాడ్‌ సిబ్బంది తనిఖీలు చేపట్టారు.  

Updated : 22 Feb 2023 23:57 IST

సికింద్రాబాద్‌: బళ్లారి ఎక్స్‌ప్రెస్‌లో బాంబు ఉందంటూ బుధవారం రాత్రి వచ్చిన ఫోన్‌కాల్‌ కలకలం రేపింది.  బళ్లారి ఎక్స్‌ప్రెస్‌లో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తి  పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేశారు. ఫోన్‌కాల్‌ వచ్చిన సమయంలో రైలు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఆగి ఉంది. దీంతో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. రంగంలోకి దిగిన  జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌, గోపాలపురం పోలీసులు, బాంబు, డాగ్‌ స్క్వాడ్‌ సిబ్బంది రైలులో తనిఖీలు చేపట్టారు. ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని