Kakinada: ఊయలే ఉరితాడై.. అంగన్వాడీలో బాలుడి మృతి
కాకినాడ జిల్లా కాజులూరులో విషాదం చోటు చేసుకుంది. గొల్లపాలెం అంగన్వాడీ కేంద్రంలో ప్రమాదవశాత్తు తాడు మెడకు చుట్టుకుని చంద్రశేఖర్(11) అనే బాలుడు మృతి చెందాడు.
కాజులూరు: కాకినాడ జిల్లా కాజులూరులో విషాదం చోటు చేసుకుంది. గొల్లపాలెం అంగన్వాడీ కేంద్రంలో ప్రమాదవశాత్తు తాడు మెడకు చుట్టుకుని ఓ బాలుడు మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. సత్యబాబు, నాగలక్ష్మి దంపతుల కుమారుడు మనోజ్ చంద్రశేఖర్ (11) 5వ తరగతి చదువుతున్నాడు. తన చెల్లిని తీసుకొచ్చేందుకు ఇంటి నుంచి అంగన్వాడీ కేంద్రానికి వెళ్లాడు. అంగన్వాడీ టీచర్ సెలవులో ఉండటంతో.. విధుల్లో ఉన్న సహాయకురాలు పిల్లలను తీసుకొచ్చేందుకు బయటకు వెళ్లారు. అదే సమయంలో చంద్రశేఖర్ తలుపులు తీసుకొని లోపలికి వెళ్లి తూకం ఉయ్యాల ఎక్కాడు. ఈ క్రమంలో ఉయ్యాల తాడు బాలుడి మెడకు చుట్టుకోవడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, అక్కడకు చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు