అదృశ్యమై.. ఇంటి సమీపంలోనే విగతజీవిగా!
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం మెల్లెంపూడిలో అదృశ్యమైన బాలుడి కథ విషాదాంతమైంది. ఆదివారం అదృశ్యమైన బాలుడు భార్గవ తేజ(6) సోమవారం సాయంత్రం
గుంటూరు జిల్లా మెల్లెంపూడిలో బాలుడి మృతి
హత్యా? వేరే కారణమా? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు
తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం మెల్లెంపూడిలో అదృశ్యమైన బాలుడి కథ విషాదాంతమైంది. ఆదివారం అదృశ్యమైన బాలుడు భార్గవ తేజ(6) సోమవారం సాయంత్రం తమ ఇంటి సమీపంలోని పొలాల్లో విగతజీవిగా కనిపించాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు భగవానియా నాయక్, అమల కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
భగవానియా నాయక్ ఓ ప్రైవేటు యూనివర్సిటీలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు. రెండో కుమారుడు భార్గవ తేజ నిన్న సాయంత్రం అదృశ్యమయ్యాడు. ఎంత వెతికినా బాలుడి ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపడుతుండగా తమ ఇంటికి సమీపంలోని పొలాల్లో భార్గవతేజ విగతజీవిగా పడి ఉన్నట్లు తెలుసుకున్నారు. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. భార్గవతేజ మెల్లెంపూడి ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. బాలుడి శరీరంపై గాయాలు ఉండడంతో ఎవరైనా హత్య చేశారా? లేక మరేదైనా కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా