Kidnap: బాలుడిని చిలకలూరిపేటలో కిడ్నాప్ చేసి కావలిలో వదిలిపెట్టారు!
పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో ఓ బాలుడిని గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. పోలీసులు వెతుకుతున్నారనే భయంతో నెల్లూరు జిల్లా కావలిలో బాలుడిని వదిలిపెట్టి వెళ్లారు.
చిలకలూరిపేట గ్రామీణ: పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో ఓ బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. పోలీసులు వెతుకుతున్నారన్న సమాచారంతో బాలుడిని దుండగులు విడిచిపెట్టడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. చిలకలూరిపేటకు చెందిన అరుణకు తమిళనాడులోని తిరువళ్లూర్ జిల్లా పేరంబాకంకు చెందిన ధాన్యం వ్యాపారి శరవణన్తో వివాహమైంది. దసరా పండుగ సందర్భంగా అరుణ చిలకలూరిపేటలోని పుట్టింటికి వచ్చారు. పట్టణంలోని చార్లెస్ కాన్వెంట్ సమీపంలో ఉన్న అమ్మవారి ఆలయంలో ఆదివారం రాత్రి పూజల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆమె 8 ఏళ్ల కుమారుడు రాజీవ్ సాయి.. ఆడుకోవడానికి బయటకు వెళ్లాడు. పూజ తర్వాత బాలుడు కనిపించలేదు. అదే సమయంలో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
రాజీవ్ సాయి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. ఆచూకీ తెలియకపోవడంతో బాలుడి తల్లి అరుణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతలోనే చెన్నైలో ఉంటున్న బాలుడి తండ్రి శరవణన్కు కిడ్నాపర్ల నుంచి ఫోన్ వచ్చింది. రాజీవ్ తమ వద్ద ఉన్నాడని.. రూ.కోటి ఇస్తేనే విడిచిపెడతామని బెదిరించారు. విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పడంతో అర్బన్ సీఐ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు అర్ధరాత్రి నుంచి కిడ్నాపర్ల కోసం వెతుకులాట ప్రారంభించాయి.
శరవణన్కు వచ్చిన ఫోన్ నంబర్తో పాటు, కిడ్నాప్ సమయంలో ఆలయ సమీపంలోని ఫోన్ నంబర్లను పోలీసులు విశ్లేషించారు. ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం చేశారు. దీంతో దొరికిపోతామని భావించిన కిడ్నాపర్లు.. నెల్లూరు జిల్లా కావలిలో కారుతో సహా బాలుడు రాజీవ్ను వదిలిపెట్టి పారిపోయారు. అనంతరం పోలీసులు చేరుకుని బాలుడిని కావలి నుంచి చిలకలూరిపేటకు తీసుకుని వస్తున్నారు. బాలుడు దొరకడంతో కుటుంబసభ్యులతో పాటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బాలుడిని దగ్గర బంధువులే కిడ్నాప్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
Crime News: తమ పొరుగునే ఉంటున్న వ్యక్తి చేతిలో ఓ యువతి లైంగిక దోపిడీకి గురైంది. శారీరకంగా హింస అనుభవించింది. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!