PUBG: ఆన్లైన్ గేమ్లు వద్దన్నందుకు.. కన్నతల్లినే కాల్చిచంపిన బాలుడు..!
పబ్జీ (PUBG) గేమ్ ఆడవద్దన్నందుకు ఏకంగా కన్న తల్లినే హతమార్చిన ఘటన వెలుగు చూసింది.
మృతదేహాన్ని 2 రోజులపాటు ఇంట్లోనే ఉంచిన యూపీ మైనర్
లఖ్నవూ: ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడిన యువత.. ఒకానొక స్థాయిలో అత్యంత దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఉత్తర్ప్రదేశ్లోనూ ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. పబ్జీ (PUBG) గేమ్ ఆడవద్దన్నందుకు ఏకంగా కన్న తల్లినే హతమార్చిన ఘటన వెలుగు చూసింది. అనంతరం తల్లి మృతదేహాన్ని గదిలోనే పెట్టి తాళం వేశాడు. ఈ దారుణాన్ని చూసిన చెల్లిని బెదిరించిన యువకుడు.. రెండు రోజులపాటు స్నేహితులతో ఇంట్లోనే కాలక్షేపం చేశాడు. చివరకు గదినుంచి దుర్వాసన ఎక్కువ కావడంతో రూమ్ ఫ్రెష్నర్ చల్లి జాగ్రత్తపడిన యువకుడి తీరు ప్రతిఒక్కరిని నిర్ఘాంతపరిచింది.
ఉత్తర్ప్రదేశ్లోని పీజీఐ పోలీస్స్టేషన్ పరిధిలోని యమునాపురం కాలనీలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి (16ఏళ్ల బాలుడు, తొమ్మిదేళ్ల బాలిక) నివాసముంటోంది. ఆర్మీ అధికారి ఐన ఆమె భర్త ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, ఆన్లైన్ గేమ్లకు అలవాటుపడిన ఆ పదహారేళ్ల కుర్రాడు తల్లితో ఎప్పుడూ గొడవ పడేవాడు. పబ్జీ గేమ్కు దూరంగా ఉండమని తల్లి ఎంత వారించినా వినని ఆ యువకుడు.. ఇంట్లో ఉన్న (తండ్రి లైసెన్స్డ్ గన్) తుపాకితో తల్లిని కాల్చి చంపాడు. అనంతరం మృతదేహాన్ని ఓ గదిలో పెట్టి తాళం వేశాడు. అంతేకాకుండా ఇళ్లు మొత్తం రూమ్ఫ్రెష్నర్ చల్లి బయటకు దుర్వాసన రాకుండా జాగ్రత్త పడ్డాడు. ఘటన జరిగిన సమయంలో అతని సోదరి అక్కడే ఉంది. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని బెదిరించడంతో చిన్నారి వణికిపోయి గదిలోనే ఉండిపోయింది.
శనివారం రాత్రి ఈ ఘటన జరగగా.. తల్లి మృతదేహాన్ని ఓ గదిలో పెట్టి, మరో గదిలో చెల్లిని నిర్బంధించాడు. అయితే, రెండురోజుల తర్వాత గది నుంచి దుర్వాసన ఎక్కువవడంతో చివరకు ఈ విషయాన్ని తన తండ్రికి తెలియజేశాడు. ఆయన వెంటనే ఈ విషయాన్ని పొరుగింటివారికి తెలపడంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. అప్పటికే కొంత కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. పోస్టుమార్టం కోసం పంపించారు. అనంతరం మైనర్ బాలుడిని విచారించగా తొలుత కట్టుకథ అల్లేందుకు ప్రయత్నించాడని యూపీ పోలీసులు వెల్లడించారు. చివరకు వాస్తవాన్ని బహిర్గతం చేసిన బాలుడు.. ఆన్లైన్ గేమ్లు ఆడకుండా అడ్డుకున్నందునే తన తల్లిని హతమార్చినట్లు అంగీకరించాడని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
-
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్