Andhra News: పెళ్లిపీటలపై విషాదం.. కుప్పకూలిన వధువు

విశాఖపట్నం మధురవాడలో వివాహంలో విషాదం చోటు చేసుకుంది.

Updated : 12 May 2022 14:33 IST

విశాఖ: విశాఖపట్నం మధురవాడలో జరిగిన ఓ వివాహంలో విషాదం చోటు చేసుకుంది. వివాహ వేడుకలో పెళ్లిపీటలపై వధువు స్పృహ కోల్పోయింది. సరిగ్గా జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో పెళ్లికుమార్తె కుప్పకూలింది. దీంతో వధువు సృజనను బంధువులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వధువు మృతిచెందింది.

శివాజీ, సృజనల వివాహం బుధవారం రాత్రి 7 గంటలకు జరగాల్సి ఉండగా.. కుటుంబ సభ్యులు సాయంత్రం రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. అనంతరం వివాహం జరుగుతున్న సమయంలో పెళ్లికుమార్తె కుప్పకూలింది. బంధువులు వెంటనే వధువును ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున మృతి చెందింది.  సృజన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పెళ్లికుమార్తె మృతితో ఇటు వధువు, అటు వరుడు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని