Madhya Pradesh: కాబోయే అత్త, ఆడపడుచుకు టీలో మత్తుమందు కలిపిచ్చి.. వధువు పరారు..

మరో మూడు రోజుల్లో పెళ్లి ఉండగా కొబోయే అత్త, ఆడపడుచులకు టీలో మత్తు మందు కలిపిచ్చి ఇంట్లోని సొమ్ము తీసుకొని వధువు పరారైంది.

Published : 23 Apr 2022 01:41 IST

భోపాల్‌: మరో మూడు రోజుల్లో పెళ్లి ఉండగా కొబోయే అత్త, ఆడపడుచులకు టీలో మత్తు మందు కలిపి ఇంట్లోని సొమ్ము తీసుకొని వధువు పరారైంది. సినిమాలోని సన్నివేశాన్ని తలపించే ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మందసౌర్‌లో నివాసముంటున్న ఓ కుటుంబంలోని వ్యక్తికి ఎంత వయసైనా పెళ్లి కాకపోవడంతో రత్లాంకు చెందిన మంగళ అనే మహిళను సంప్రదించారు. ఆమె వీళ్ల దగ్గరి నుంచి రూ.2లక్షలు తీసుకొని నర్మదాపురానికి చెందిన ఆర్తి బింద్‌ అనే అమ్మాయితో సంబంధం కుదిర్చింది. మరో మూడు రోజుల్లో వివాహం జరగనుంది. ఇంట్లో కాబోయే అత్త, ఆడపడుచు మాత్రమే ఉన్న సమయంలో వాళ్లిద్దరికీ టీలో మత్తు మందు కలిపి రూ.లక్ష తీసుకొని ఆర్తి పరారైంది. ప్రస్తుతం వాళ్లిద్దరూ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని