Andhra News: అయ్యో పాపం.. బైక్‌పై వెళ్తుండగా అన్నదమ్ముల సజీవదహనం

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. ఉదయాన్నే పొలం వద్దకు వెళుతున్న ఇద్దరు యువకులు దారిలోనే సజీవ దహనమయ్యారు.

Updated : 24 Jun 2022 12:24 IST

జంగారెడ్డిగూడెం గ్రామీణం: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. ఉదయాన్నే పొలం వద్దకు వెళుతున్న ఇద్దరు యువకులు దారిలోనే సజీవ దహనమయ్యారు. వివరాల్లోకి వెళితే.. దేవులపల్లి గ్రామానికి చెందిన అన్నదమ్ములు వల్లేపల్లి నాగేంద్ర (21), వల్లేపల్లి ఫణీంద్ర (19) పాలు తెచ్చేందుకు పొలం వద్దకు బైక్‌పై బయల్దేరారు. 

మార్గంమధ్యలో బైక్‌పై 11కేవీ విద్యుత్‌ వైరు తెగి పడటంతో మంటలు చెలరేగాయి. దీంతో బైక్‌పై ఉన్న అన్నదమ్ములిద్దరూ అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మృతుల్లో నాగేంద్ర ఇంజినీరింగ్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతుండగా.. ఫణీంద్ర ఇంటర్‌ సెకండియర్‌ పూర్తిచేశారు. చేతికి అందివచ్చిన కుమారులు చనిపోవడంతో తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా మారింది.

విద్యుత్‌శాఖ నిర్లక్ష్యమే ఈ విషాదానికి కారణమని గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించి..  దీనికి కారణమైన  అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని