కన్నీరు పెట్టిస్తోన్న బీటెక్ విద్యార్థి సెల్ఫీ వీడియో
చదువుల భారం ఓ ఘోరానికి కారణమైంది. తల్లిదండ్రులకు ఆరని కడుపుమంట రగిల్చింది. పొత్తిళ్లలో పెరిగిన బిడ్డ ఒత్తిళ్లకు తాళలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన
కళాశాల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య
పెనుగంచిప్రోలు: చదువుల భారం ఓ ఘోరానికి కారణమైంది. తల్లిదండ్రులకు ఆరని కడుపుమంట రగిల్చింది. పొత్తిళ్లలో పెరిగిన బిడ్డ ఒత్తిళ్లకు తాళలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. జీవితంలో పైకి రావాల్సిన కుమారుడు ‘క్షమించమ్మా’ అంటూ కళాశాల పైనుంచి దూకి మృతిచెందాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో.. ఇప్పుడు అందిరితో కన్నీరు పెట్టిస్తోంది. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలుకు చెందిన వడ్డెల్లి గోపాలరావు, తులసి దంపతులకు తిరుమలేశ్ ఒక్కగానొక్క సంతానం. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో తల్లి ఉపాధ్యాయురాలిగా, తండ్రి బోధనేతర సిబ్బందిగా పనిచేస్తూ కుమారుడు అల్లారుముద్దుగా పెంచారు. ఏలూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ చదివిస్తున్నారు.
లాక్డౌన్ సమయంలో ఇంటికొచ్చి సంతోషంగా గడిపిన తిరుమలేశ్.. కళాశాలకు వెళ్లిన నాలుగు రోజులకే చదవలేకపోతున్నానంటూ ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం సెల్ఫీ వీడియో తీసుకుని తల్లిదండ్రులు, మిత్రులకు పంపించి కళాశాల భవనం పైనుంచి దూకేశాడు. ‘అమ్మానాన్నా.. మీరు నిండు నూరేళ్లు జీవించండి’ అంటూ అర్ధాంతరంగా జీవితాన్ని ముగించాడు. కొనఊపిరితో ఉన్న తిరుమలేశ్ను విజయవాడ తరలించి అత్యవసర చికిత్స అందించినప్పటికీ ప్రాణాలు నిలవలేదు. ఏదో ఒక రూపంలో తమ బిడ్డ ఈలోకంలో బతికి ఉండాలనే ఉద్దేశంతో తిరుమలేశ్ నేత్రాలు ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి దానం చేశారు. మంగళవారం పెనుగంచిప్రోలులో అంత్యక్రియలు నిర్వహించారు.
ఇవీ చదవండి..
బాలికపై రేప్ కేసులో సంచలన తీర్పు
ఐటీ అధికారులమని వెళ్లి కిడ్నాప్ చేశారు: సీపీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?