crime news: విశాఖ విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం

విశాఖ విమానాశ్రయంలో ఓ మహిళా ప్రయాణికురాలి బ్యాగ్‌లో సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు 13 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఎయిర్‌పోర్టు

Updated : 05 Oct 2021 23:10 IST

విశాఖపట్నం: విశాఖ విమానాశ్రయంలో ఓ మహిళా ప్రయాణికురాలి బ్యాగ్‌లో సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు 13 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఎయిర్‌పోర్టు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విశాఖ ఆర్‌కే బీచ్‌ సమీపంలో నివాసముంటున్న తిపురాని సుజాత(73) హైదరాబాద్‌లో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లేందుకు ఇండిగో విమానం టికెట్‌ తీసుకున్నారు. ఈక్రమంలో ఆమె బ్యాగ్‌ తనిఖీ చేసిన సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు 13 బుల్లెట్లను గుర్తించి ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. అయితే, సదరు మహిళ బంధువు పిస్టల్‌ లైసెన్స్‌ కలిగి ఉన్నారని, ప్రస్తుతం ఆయన మృతి చెందడంతో ఆయన బ్యాగ్‌లో దుస్తులు పెట్టుకుని  బంధువుల ఇంటికి వెళ్తున్నట్టు తెలిపారు. బ్యాగ్‌లో బుల్లెట్లు ఉన్నట్టు తాను గుర్తించలేదని ఆమె చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి ఆమెను విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని