Crime: బస్సు, ట్రాలీ ఆటో ఢీకొని ఒకరు మృతి

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందారు.

Updated : 10 May 2022 14:44 IST

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందారు. మహారాష్ట్రలోని ఉద్గిర్ ప్రాంతానికి చెందిన పెళ్లి బృందం హైదరాబాద్ నుంచి సామగ్రిని తీసుకొని ఓ ప్రైవేటు బస్సులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బైపాస్ రోడ్డులోని అల్గోల్ చౌరస్తా వద్ద రోడ్డు దాటుతున్న ట్రాలీ ఆటోను  బస్సు ఢీ కొట్టింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆటో పూర్తిగా దగ్ధమైంది. అందులో ప్రయాణిస్తున్న సమీర్ అనే వ్యక్తి సజీవదహనం అయ్యారు. షేక్ ఇమామ్, కలీం, కుమార్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని