HYD: ఎల్బీనగర్‌లో వ్యాపారి కిడ్నాప్‌ కలకలం

నగరంలోని ఎల్బీనగర్‌లో వ్యాపారి కిడ్నాప్‌ కలకలం రేపింది

Updated : 03 Jul 2021 12:50 IST

హైదరాబాద్‌: నగరంలోని ఎల్బీనగర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధి డిఫెన్స్‌ కాలనీలో వ్యాపారి కిడ్నాప్‌ కలకలం రేపింది. కైఫ్‌ ట్రేడర్స్‌ ఉడ్‌ యజమాని ఆరిఫ్‌ అక్బర్‌ను దుండగులు కారులో తీసుకెళ్లారు. సీసీ కెమెరాలను ఆఫ్‌ చేసి దుకాణంలో ఉన్న రూ.లక్షల విలువైన కలప ఎత్తుకెళ్లారు. ఆర్థిక లావాదేవీలే కిడ్నాప్‌కు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కిడ్నాప్‌ చేసిన అక్బర్‌ను దుండగులు మేడ్చల్‌లో వదిలివెళ్లారు. అనంతరం వ్యాపారి మేడ్చల్‌ నుంచి నాగ్‌పుర్‌ వెళ్లినట్లు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు 10 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని