Kolkata: గంటల వ్యవధిలో కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు..
కోల్కతా నగరంలో ఓ వ్యాపారవేత్త కిడ్నాప్ కేసును గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు. సినిమాలోని సన్నివేశాన్ని తలపించే ఈ ఘటన కోల్కతాలో జరిగింది.
కోల్కతా: కోల్కతాలో కిడ్నాప్ అయిన ఓ వ్యాపారవేత్తని పోలీసులు గంటల వ్యవధిలోనే రక్షించారు.కుతుబుద్దిన్ ఘాజీ(37) కోల్కతాలో వ్యాపారం చేసేవారు. కొందరు వ్యక్తులు అతనిని బలవంతంగా పోలీసు వ్యాన్లో ఎక్కించుకొని తీసుకువెళ్లారు. బయటకు వెళ్లి ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో తన సహ వ్యాపారస్థుడు రెహ్మాన్ అహ్మద్ ఖురేషి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై పోలీసులు ఘాజీ కుటుంబసభ్యులను విచారించగా అంతకు ముందే వారికి కొందరు వ్యక్తులు ఫోన్ చేసి పోలీసులమంటూ చెప్పారన్నారు. దీంతో ఘాజీ కిడ్నాప్ అయినట్లు నిర్ధారించుకున్న పోలీస్ కమిషనర్ వినీత్ గోయెల్ మిగతా పోలీసులతో కలసి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అర్ధరాత్రి తాలిగంజ్ ప్రాంతంలో వ్యాపారవేత్తను కిడ్నాపర్ల చెర నుంచి ప్రాణాలతో రక్షించారు.
కాగా... ఈ మొత్తం ఘటనపై పోలీస్కమిషనర్ గోయెల్ మాట్లాడారు. ‘మేము ఇలాంటి నేరాల పట్ల చాలా అప్రమత్తంగా ఉంటాం. అందుకే సమాచారం అందిన కొన్ని గంటల్లోనే కిడ్నాప్ అయిన వ్యక్తిని ప్రాణాలతో రక్షించగలిగాము’ అని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఐదుగురిని అరెస్టు చేశారు. కిడ్నాప్కు ఉపయోగించిన రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కిడ్నాప్ వెనుక వ్యాపారపరమైన కారణాలేమైనా ఉన్నాయేమోనని అనుమానిస్తునట్లు పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టులకు రేటింగ్ ఇస్తే మంచి కమీషన్ ముట్టజెబుతామని భారీ మోసానికి పాల్పడిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా 580 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.32.34 కోట్ల నగదును జప్తు చేశారు. -
రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో తనిఖీలు
బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరివారిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో గురువారం పలు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. -
గ్రూప్-1 ఉద్యోగాల పేరిట టోకరా.. పోలీసుల అదుపులో నిందితుడు
‘గ్రూప్-1’ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించిన ముఠాలో ఓ నిందితుడిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
వైకాపా నేత బావమరిది నకిలీ కరెన్సీ నోట్లతో ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేయబోయి అక్కడి సిబ్బందికి దొరికిపోయాడు. -
కోటాలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
రాజస్థాన్లో పోటీ పరీక్షల శిక్షణ సంస్థలకు నెలవైన కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. -
ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీగా ఎదురుకాల్పులు
మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దున కాంకర్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య బుధ, గురువారాల్లో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. -
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
ఎయిర్ బ్లోయర్ నాజిల్ను మర్మాంగంలోకి చొప్పించడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి