Andhra News: విజయవాడలో గంజాయి బ్యాచ్‌ వీరంగం

ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ టూటౌన్ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది.

Updated : 12 May 2022 15:02 IST

విజయవాడ: ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ టూటౌన్ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. లంబాడిపేట ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం అర్ధరాత్రి సమయంలో ఐదు బైక్‌లను తగలబెట్టారు. నగర శివారు ప్రాంతం కావడంతో ఇక్కడ నిత్యం గంజాయి మత్తులో కొందరు యువకులు అల్లర్లకు పాల్పడతారని సమాచారం.

గంజాయి విషయాన్ని పోలీసులకు తాము చెబుతున్నట్లు అనుమానించే దుండగులు బైక్‌లను తగులబెట్టినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న టూటౌన్‌ కొత్తపేట పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు