Crime news: హైదరాబాద్‌లో దారుణం.. రెండేళ్ల చిన్నారిపై కారు ఎక్కించిన యువకులు

సనత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. రెండేళ్ల చిన్నారిని కారుతో ఢీకొట్టిన యువకులు అక్కడి నుంచి పరారయ్యారు.

Updated : 26 Jun 2022 21:21 IST

హైదరాబాద్‌: సనత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. రెండేళ్ల చిన్నారిని కారుతో ఢీకొట్టిన యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. జింకలవాడ బస్తీలో రెండేళ్ల చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో ఓ కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. కారు అతి వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే కారులోని యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని