Telangana News: మద్యం మత్తులో 9 బైక్‌లను కారుతో ఢీకొట్టిన యువకుడు

మద్యం మత్తులో మందుబాబులు వీరంగం సృష్టిస్తున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమీపంలో కారు బీభత్సం సృష్టించింది...

Published : 24 Mar 2022 01:14 IST

జగిత్యాల: మద్యం మత్తులో మందుబాబులు వీరంగం సృష్టిస్తున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమీపంలో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో మోహన్‌ అనే యువకుడు కారు నడపడంతో ప్రమాదం చోటు చేసుకుంది. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. పార్కింగ్‌ చేసిన వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 9 ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని