Andhra News: కర్నూలు జిల్లాలో బావిలోకి దూసుకెళ్లిన కారు

కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట వద్ద కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. కర్నూలు నుంచి ఎమ్మిగనూరు వైపు వెళ్తున్న కారు..

Updated : 10 Feb 2022 19:06 IST

ఎమ్మిగనూరు: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామం వద్ద కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. కర్నూలు నుంచి ఎమ్మిగనూరు వైపు వెళ్తున్న కారు.. ముందు వెళ్తున్న మరో కారును ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఒక్కరే ఉన్నట్టు గుర్తించారు.  ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. స్థానికులు క్రేన్‌ సాయంతో బావిలో నుంచి కారును బయటకు తీశారు. అందులోని మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడు కోడుమూరుకు చెందిన రామాంజ నేయులుగా గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని