Crime news: ప్రేమించి మోసం చేశారని ట్రైనీ ఐఏఎస్పై కూకట్పల్లిలో కేసు నమోదు
ట్రైనీ ఐఏఎస్ బానోత్ మృగేందర్లాల్పై కూకట్పల్లి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. మృగేందర్లాల్ పెళ్లి పేరుతో మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేయడంతో ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్: ట్రైనీ ఐఏఎస్ బానోత్ మృగేందర్లాల్పై కూకట్పల్లి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. పెళ్లి పేరుతో మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేయడంతో ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృగేందర్లాల్ .. వైరా మాజీ ఎమ్మెల్యే మదన్లాల్ కుమారుడు. ప్రస్తుతం మదురైలో ట్రైనీ ఐఏఎస్గా ఉన్నారు. ఫేస్బుక్లో మృగేందర్లాల్తో తనకు పరిచయం ఏర్పడిందని, ప్రేమ పేరుతో తనకు దగ్గరయ్యాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లికి మృగేందర్లాల్ నిరాకరిస్తున్నారని, తన కుమారుడిని వదిలేయాలని ఆయన తండ్రి బెదిరిస్తున్నారని యువతి ఆరోపించారు. రూ.25లక్షలు డబ్బు కూడా ఆశచూపారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గత నెల 27న కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ట్రైనీ ఐఏఎస్ పై కేసు నమోదు కాగా.. ఆలస్యంగా ఈఘటన వెలుగులోకి వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్