Crime News:మాటల్లో పెట్టి.. కొంగులో పట్టీపెట్టి

బంగారు ఆభరణాలు, పట్టీలు చోరీ చేశారు

Published : 26 May 2021 01:09 IST

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని ఓ ఆభరణాల దుకాణంలో ఇద్దరు మహిళలు చేతివాటాన్ని ప్రదర్శించారు. అల్వాల్ వెంకటాపురంలోని ఓ నగల దుకాణానికి వెండి పట్టీలు కావాలంటూ ఇద్దరు మహిళలు వచ్చారు. దుకాణాదారులను మాటల్లో పెట్టి.. బంగారు ఆభరణాలు, పట్టీలు చోరీ చేశారు. దొంగతనం చేస్తున్న దృశ్యాలు దుకాణంలోని సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. విషయం తెలిసి షాక్కు గురైన దుకాణాదారులు పోలీసులను ఆశ్రయించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని