Avinash Reddy: మరోసారి అవినాష్రెడ్డి ఇంటికి సీబీఐ.. స్వయంగా నోటీసులు అందజేత
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో దర్యాప్తు వేగంగా జరుగుతోంది. మంగళవారం మధ్యాహ్నం ఇద్దరు సీబీఐ అధికారులు కడప నుంచి పులివెందులకు చేరుకుని ఎంపీ అవినాష్రెడ్డి ఇంటి పరిసరాలను పరిశీలించారు.
పులివెందుల: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో దర్యాప్తు వేగంగా జరుగుతోంది. మంగళవారం మధ్యాహ్నం ఇద్దరు సీబీఐ అధికారులు కడప నుంచి పులివెందులకు చేరుకుని ఎంపీ అవినాష్రెడ్డి ఇంటి పరిసరాలను పరిశీలించారు. వివేకా హత్య జరిగిన రోజు అవినాష్రెడ్డి (MP Avinash Reddy) ఆయన ఇంటి నుంచి వివేకా ఇంటికి ఎంత సమయంలో వెళ్లారు? ఎంత దూరం ఉంది?అనే అంశాలను సీబీఐ అధికారులు పరిశీలించినట్టు తెలుస్తోంది.
సీబీఐ తొలుత ఇచ్చిన నోటీసుల ప్రకారం ఇవాళ ఉదయం అవినాష్రెడ్డి సీబీఐ ఎదుట హాజరుకావాల్సి ఉంది. అయితే, ముందస్తు కార్యక్రమాలు ఉన్నందున విచారణకు రాలేనని.. మరో నాలుగు రోజులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున గడువుకావాలని సీబీఐకి లేఖ రాశారు. అవినాష్ లేఖపై స్పందించిన సీబీఐ అధికారులు ఈనెల 19న విచారణకు హాజరుకావాలని వాట్సాప్ ద్వారా నోటీసు పంపారు. ఈరోజు మధ్యాహ్నం పులివెందులలోని అవినాష్ ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారులు 19న విచారణకు రావాలని స్వయంగా నోటీసులు అందజేశారు. ఆ సమయంలో ఎంపీ ఇంట్లో లేకపోవడంతో ఆయన డ్రైవర్ నాగరాజుకు నోటీసులు అందజేశారు.
అవినాష్ అనుచరులను విచారిస్తున్న సీబీఐ
వివేకా హత్యకేసు దర్యాప్తులో భాగంగా పలువురికి సీబీఐ అధికారులు నోటీసులు అందజేశారు. అందులో భాగంగా ఇవాళ ఎంపీ అనుచరులుగా భావిస్తున్న ముగ్గురు వైకాపా నేతలను కోటిలోని సీబీఐ కార్యాలయానికి పిలిపించి విచారిస్తున్నారు. వారిలో వైకాపాకు చెందిన సింహాద్రిపురం మండల ఉపాధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, వేముల మండలం నల్లచెరువు పల్లె గ్రామానికి చెందిన రవీంద్రారెడ్డి, అదే మండలానికి చెందిన నాగ విశ్వేశ్వర్రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఈ ముగ్గురి నుంచి వివేకా హత్య జరిగిన రోజు చోటు చేసుకున్న పరిణామాలను సీబీఐ అధికారులు అడిగి తెలుసుకున్నట్టు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!