AP News: వివేకా వాచ్‌మెన్‌ను ప్రశ్నించిన సీబీఐ

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో 36వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది.

Updated : 13 Jul 2021 03:40 IST

కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో 36వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప సెంట్రల్‌ జైలు అతిథిగృహంలో అనుమానితులను అధికారులు విచారిస్తున్నారు. ఈరోజు వివేకా ఇంటి వాచ్‌మెన్‌ రంగన్నను సీబీఐ ప్రశ్నించింది. హత్య జరిగిన రోజు వివేకా ఇంటి వద్ద రంగన్న కాపలా ఉన్నారు. గతంలో సిట్‌ అధికారులు కూడా ఆయన్ను విచారించి గుజరాత్‌లో నార్కో పరీక్షలు నిర్వహించారు.

మరోవైపు వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, డ్రైవర్‌ దస్తగిరిని కూడా సీబీఐ విచారిస్తోంది. గత రెండు వారాలుగా ఎర్ర గంగిరెడ్డిని.. గత 20 రోజులుగా దస్తగిరిని విచారిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని